ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియని.. నాగరికతకు దూరంగా ఉంటున్న తెగలు.. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. ఇలాగే అమెజాన్ అడవుల్లో కూడా ఒక సంబంధించిన అరుదైన, భయంకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ప్రముఖ అమెరికన్ పర్యావరణవేత్త పాల్ రోసోలీ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను పంచుకున్నారు. అమెజాన్ అడవుల్లో ఉండే తెగతో జరిగిన ఘర్షణ, వారు తమపై జరిపిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు.200 మంది గిరిజనుల మెరుపు దాడిపాల్ రోసోలీ తన టీమ్‌తో కలిసి అమెజాన్ నదిలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘోర సంఘటన జరిగింది. మొదటి రోజు ప్రశాంతంగా ఉన్న గిరిజనులు.. రెండో రోజు మాత్రం ఒక్కసారిగా తిరగబడ్డారని గుర్తు చేసుకున్నారు. సుమారు 200 మంది గిరిజనులు నది ఒడ్డుకు చేరుకుని పాల్ రోసోలీ ప్రయాణిస్తున్న బోటును చుట్టుముట్టారు. అనంతరం వారు నాన్‌స్టాప్‌గా బోటుపై బాణాలు వదిలారు. బోటులోని వారు ప్రాణాలు కాపాడుకోవడానికి బియ్యం బస్తాలు, బెంచీల కింద దాక్కున్నారు.పాల్ రోసోలీ టీమ్‌పై ఆ అడవి తెగ జరిపిన దాడిలో ఆ బోటు డ్రైవర్ జార్జ్ తీవ్రంగా గాయపడ్డారు. బోటును వేగంగా పోనిచ్చే ప్రయత్నం జార్జ్ చేయగా.. సరిగ్గా అదే సమయంలో ఒక 7 అడుగుల పొడవైన బాణం వచ్చి అతని భుజం వెనుక భాగం నుంచి దూసుకుపోయి.. కడుపులో నుంచి బయటకు వచ్చిందని.. దీంతో బోటు మొత్తం రక్తంతో తడిసిపోయినట్లు చెప్పారు. సాధారణంగా ఇలాంటి తెగలకు సంబంధించిన వీడియోలు చాలా దూరం నుంచి తీస్తారు. కానీ పాల్ రోసోలీ తీసిన వీడియో ఫుటేజ్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.గిరిజనులు విల్లంబులు పట్టుకుని.. దట్టమైన అడవి నుంచి ఇసుక తిన్నెలపైకి రావడం ఇందులో కనిపిస్తుంది. ఈ గిరిజనులకు బయటి ప్రపంచంలోని వైరస్‌ల పట్ల రోగనిరోధక శక్తి ఉండదు. ఒక చిన్న జలుబు లేదా దగ్గు కూడా వారి తెగ మొత్తాన్ని తుడిచిపెట్టగలదు. అందుకే ఇలాంటి ఎన్‌కౌంటర్లు వారికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.సంఘర్షణకు కారణాలేంటి?అమెజాన్ అడవుల్లో అక్రమ మైనింగ్, కలప స్మగ్లింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోవడంతో.. ఈ తెగలు తమ ఉనికిని కాపాడుకోవడానికి హింసాత్మకంగా మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వారి నివాస ప్రాంతాలు కుంచించుకుపోవడంతో వారు ఇతరులపై దాడులు చేసేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.