బాబోయ్ దోమలు.. మూసాపేటలో భయంకరమైన పరిస్థితి, స్థానికులకు నిద్రలేని రాత్రులు

Wait 5 sec.

హైదరాబాద్ మూసాపేటలోని గ్రీన్ హిల్స్ రోడ్ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం భయంకరమైన పోరాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాముని చెరువు, మైసమ్మ చెరువుల నిర్వహణను గాలికి వదిలేయడం వల్ల వేలాది కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. ముఖ్యంగా రెయిన్‌బో విస్టాస్, రెయిన్‌బో విస్టాస్ రాక్ గార్డెన్, మెరీనా స్కైస్ వంటి భారీ అపార్ట్‌మెంట్ సముదాయాల్లో ప మారింది.కాముని చెరువులో గుర్రపుడెక్క తొలగింపునకు సంబంధించిన కాంట్రాక్ట్ 2025 అక్టోబర్‌లోనే ముగిసింది. గత నాలుగు నెలలుగా ఈ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకపోవడంతో చెరువు మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోయింది. నిల్వ ఉన్న నీరు, కుళ్ళిన వ్యర్థాలు దోమల సంతతికి నిలయంగా మారాయి. ఫలితంగా, నివాసితుల ఇళ్లు, బాల్కనీలు, కామన్ ఏరియాల్లోకి దోమల గుంపులు లక్షల సంఖ్యలో చొరబడుతున్నాయి. స్థానిక నివాసితులు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగానికి, ఉన్నతాధికారులకు పదేపదే ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ' చర్యలు తీసుకుంటాం.. టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది' అనే ఒకే రకమైన సమాధానం అధికారుల నుంచి వస్తోంది కానీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. అప్పుడప్పుడు చేసే ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయని, దోమల ఉధృతి ఏమాత్రం తగ్గలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నియంత్రణలో తమకు అవార్డులు, సర్టిఫికెట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకునే జీహెచ్‌ఎంసీ.. తమ సొంత పరిధిలోని ఒక నగరాన్ని ఇలా హెల్త్ ఎమర్జెన్సీలోకి నెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా మొద్దునిద్ర వీడి, తక్షణమే గుర్రపుడెక్కను తొలగించి, రసాయనాలను వెదజల్లి తమను ఈ దోమల పీడ నుంచి కాపాడాలని గ్రీన్ హిల్స్ రోడ్ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు.