బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే వారికి ఊరట.. రూ.691.81 కోట్లతో రహదారి విస్తరణ.. 70 కి.మీ తగ్గనున్న దూరం

Wait 5 sec.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల విస్తరణ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి పనుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పలు జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని జాతీయ రహదారి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇది పూర్తయితే , వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ఈ రహదారి విస్తరణ వల్ల సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.కర్నూలు జిల్లాలో ఉన్న శరవేగంగా సాగుతున్నాయి. నంద్యాల మండలం కానాల నుంచి సంజామల మండలంలో ఉన్న నొస్సం వరకు.. కోవెలకుంట్ల మీదుగా 62.01 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ. 691.81 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. గత సంవత్సరం జూన్‌లో రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. దీనిలో భాగంగా బైపాస్, కల్వర్టుల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి.ప్రస్తుతం కోవెలకుంట్ల, జొలదరాశి గ్రామాల మధ్య తారు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయింది. దీంతో రోడ్డు నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే.. వేలాది వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే వారికి ఈ రహదారి నిర్మాణం వల్ల దూరం తగ్గడంతో ప్రయాణ సమయం కూడా కలిసిరానుంది. వస్తే జిల్లా నుంచి బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లేవారికి సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. రహదారి నిర్మాణం గురించి సంబంధిత అధికారులు దశలవారీగా పనులు చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది.