బంగ్లాదేశ్ – మధ్య కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 వివాదం మరింత ముదురుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్లాల్సిన ఐసీసీ ప్రతినిధి బృందాని అనూహ్య సమస్య ఎదురైంది. ఇద్దరు సభ్యులతో వెళ్లాల్సిన ఐసీసీ డెలిగేషన్, వీసా సమస్య వచ్చిందిఐసీసీ యాంటీ-కరప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగాధిపతి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ జనవరి 17న ఢాకాకు చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు వెళ్లాల్సిన భారతీయ పౌరసత్వం కలిగిన సీనియర్ ఐసీసీ అధికారి సమయానికి బంగ్లాదేశ్ వీసా పొందలేకపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో కీలక చర్చలు ఊహించని మలుపు తిరిగాయి. ఈ పర్యటనను ఐసీసీ చివరి ప్రయత్నంగా భావిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా మూడు వారాలే ఉండటంతో, ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీలో పాల్గొనే విషయంలో బంగ్లాదేశ్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.వివాదానికి ప్రధాన కారణం భద్రత సమస్యలను చూపడమే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కారణంగా చూపుతూ, తమ జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ – భారత్‌లో జరగాల్సిన తమ గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఢాకాకు వెళ్లిన ఆండ్రూ ఎఫ్గ్రేవ్‌పై ఇప్పుడు మొత్తం బాధ్యత పడింది. అంతర్జాతీయ క్రీడా భద్రతలో అనుభవం ఉన్న మాజీ బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన ఎఫ్గ్రేవ్, భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు కఠిన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని వివరించేలా ఒక సమగ్ర సెక్యూరిటీ ప్లాన్‌ను బీసీబీ, ప్రభుత్వ ప్రతినిధుల ముందు ఉంచనున్నారు.భారతీయ ఐసీసీ అధికారి వీసా పొందలేకపోవడం, ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలకు ప్రతిబింబంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై ఐసీసీ అధికారికంగా స్పందించలేదు. వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో, ఈ ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం కనుగొనాల్సిన ఒత్తిడి ఐసీసీపై పెరిగింది.