ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అనుమానాస్పద మృతి.. ఓహో అసలు సంగతి అదన్నమాట!

Wait 5 sec.

సంక్రాంతి పండుగ కోసం సొంత ఊరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అనుమానాస్పద మరణం కలకలం రేపింది. కంభంవారిపల్లె మండలం బండవంటిపల్లెకు చెందిన ఆరుగురు యువకులు శనివారం ఊరి చివర మద్యం సేవించడానికి వెళ్లారు. అక్కడ మణి, పుష్పరాజ్ అనే ఇద్దరు యువకులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికాగా.. వారిని వెంటనే పీలేరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు . మరణించిన మణి చెన్నైలో, పుష్పరాజ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మణికి భార్య, కుమారుడు ఉన్నారు.. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. కల్తీ మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. 'అన్నమయ్య జిల్లాలో పోటీపడి 19 బీర్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటను నకిలీ మద్యం తాగి చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలం బండవడ్డీపల్లిలో సంక్రాంతి సందర్భంగా ఆరుగురు యువకులు పార్టీ చేసుకున్నారు. అందులో ఇద్దరు యువకులు ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పోటీపడి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ వారు 19 బీర్లు తాగారు. 'అధిక సంఖ్యలో బీర్లు తాగడంతో వారు డీహైడ్రేషన్ కు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మరణించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించాడు. అదే బీరు తక్కువ తాగిన ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) బాగానే ఉన్నారు. వారు తాగిన బీరు శాంపుళ్లను చిత్తూరు కు విశ్లేషణకు పంపించడమైనది' అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది.