ప్రజలకు అదిరిపోయే బంపరాఫర్.. ఆ భూములు జస్ట్ రూ.100 కే రిజిస్ట్రేషన్ చేస్తారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆ భూముల్ని వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ చేయనుంది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ను అక్టోబరు నుంచి అందుబాటులోకి తెస్తామని వివరించారు. రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 చొప్పున.. అంతకు మించితే రూ.1,000 చొప్పున రుసుము తీసుకుని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు, ఫిర్యాదుల పరిష్కారంపై ఆమె కలెక్టర్ల సదస్సులో ప్రజంటేషన్‌ ఇచ్చారు. వచ్చే నెల నుంచ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లను సులభతరం అవుతుంది.. ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుంది. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ఆగస్టు వరకు గతేడాది కంటే ఈ ఏడాది 30.95% ఎక్కువ ఆదాయం వచ్చింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ఆదాయం తగ్గింది. ఏపీలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4,468.79 కోట్లు వచ్చాయని ఆదాయార్జన శాఖల సమీక్షలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో ఆదాయం బాగా పెరిగింది. కానీ తెలంగాణలో మాత్రం 2.74% ఆదాయం తగ్గింది. కర్ణాటకలో కూడా 7.12% ప్రతికూల వృద్ధి నమోదైంది.ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,412.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మాత్రం రూ.4,468.79 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. 2027 నాటికి రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అంతకంటే ముందే పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అభ్యంతరం లేని భూములన్నింటినీ క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చిస్తుంది. పంచాయతీల వారీగా రెవెన్యూ గ్రామాల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారు. సర్వే నంబర్ మాత్రం మారదు. రెవెన్యూ గ్రామం పేరు మారుస్తామని అధికారులు తెలిపారు. జియోట్యాగింగ్, క్యూఆర్‌ కోడ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 60% ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెవెన్యూ శాఖలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని.. అందుకే ఇకపై రెవెన్యూ శాఖపై తాను కూడా ఎక్కువ శ్రద్ధ పెడతానని చెప్పారు. ఏ జిల్లాలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటే ఆ జిల్లా అధికారులు బాగా పనిచేసినట్లుగా పరిగణిస్తామని, ఎక్కువ సమస్యలు ఉంటే కలెక్టర్ సరిగా పనిచేయనట్లుగా భావిస్తామన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వ ఫైళ్లన్నీ 100% ఆన్‌లైన్‌లో పెట్టాలని, అధికారులు రియల్ టైమ్‌లో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ రికార్డుల్లో తప్పులు జరగకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధానాలను అమలు చేస్తామని చంద్రబాబు వివరించారు. ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీజీ కేంద్రాలను నవంబర్ నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అక్కడ టెక్నాలజీపై అవగాహన ఉన్న గ్రూప్-1 అధికారిని నియమిస్తామని తెలిపారు.