ఆపరేషన్ పోలో.. 5 రోజుల యుద్ధానికి రూ.6 కోట్లు ఖర్చు, ఆ బిల్లు కూడా నిజాం వద్దే వసూలు..!

Wait 5 sec.

ఇండియాకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ నిజాం నవాబు పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం 13 నెలల తర్వాత.. అంటే నాటి భారత ప్రభుత్వం '' పేరుతో చేపట్టిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు భారత్‌లో విలీనానికి అంగీకరించారు. నిజాం పాలనలో ప్రస్తుత తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటకలోని హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే నిజాం నవాబు మాత్రం దీనిని వ్యతిరేకించారు. తాము ప్రత్యేక సంస్థానంగానే ఉంటామని, అవసరమైతే పాకిస్థాన్‌లో కలుస్తామని కూడా ప్రకటించారు.దేశం మధ్యలో ఉన్న ఇంత పెద్ద ప్రాంతం భారత్‌లో విలీనం కాకపోతే అది దేశ సమగ్రతకు ముప్పు అని గ్రహించిన నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యకు దిగాలని నిర్ణయించారు. దీనికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సైతం మద్దతు తెలిపారు. ఇదే సమయంలో నిజాం నవాబు పాకిస్థాన్ సహాయం కోసం ప్రయత్నించడంతో పాటు ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా'ఆపరేషన్ పోలో'ను ప్రారంభించింది. ఐదు రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యలో నిజాం సైన్యం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైంది. ఈ విజయం దేశ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోయింది.ప్రస్తుతం చందానగర్ ఫ్లైఓవర్ ఉన్న చోటే ముగింపుకు నాంది పలికిన చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 1948, సెప్టెంబర్ 18న ఇక్కడే భారత సైన్యం, హైదరాబాద్ సైన్యం కలుసుకున్నాయి. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్, భారత సైన్యాధిపతి మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరికి లొంగిపోయారు. అలా 224 ఏళ్ల అసఫ్ జాహీ పాలన ముగిసింది. ఈ ఇద్దరు జనరల్స్ ఒకప్పుడు సికింద్రాబాద్‌లో పరిచయస్తులు కాగా.. సికింద్రాబాద్ క్లబ్‌లోని కొలొనేడ్ బార్‌లో ఇప్పటికీ వీరిద్దరి చిత్రపటాలు కొలువుదీరి ఉన్నాయి. హైదరాబాద్‌ను అనేది కేవలం ఐదు రోజుల్లో జరిగిన ఒక హఠాత్ సంఘటన కాదు. ఇది ఆరు నెలలకు పైగా జరిగిన ఒక సుదీర్ఘమైన, వ్యూహాత్మకమైన సన్నాహాల పర్యవసానం. నవంబర్ 29, 1947న స్టాండ్‌స్టిల్ ఒప్పందం కుదిరినా.. భారత ప్రభుత్వం మార్చి 1948 నాటికి తమ సైనిక బలగాలను హైదరాబాద్ సరిహద్దుల వద్ద మోహరించడం ప్రారంభించింది. మార్చి 1, 1948 నాటికి తొలి సైనిక యూనిట్ ‘740 గూడ్స్ అండ్ పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ’ హైదరాబాద్ సరిహద్దుకు చేరుకుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, కశ్మీర్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా సైనిక దళాలు తరలి వచ్చాయి. భారతదేశం కశ్మీర్‌లో యుద్ధం, దేశ విభజన సమస్యలతో బిజీగా ఉందని భావించిన హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ ఈ సైనిక సమీకరణ సాధ్యం కాదని తప్పడు అంచనా వేశారు. ఈ చర్యను అప్పటి బ్రిటిష్ సైనికాధికారి జనరల్ రాయ్ బుచర్ కూడా వ్యతిరేకించారు. ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. అయినప్పటికీ.. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు సాగింది. మార్చి 31 నాటికి ‘1 బీహార్ రెజిమెంట్’, మే 5 నాటికి ‘9 డోగ్రా రెజిమెంట్’, మే 20 నాటికి ‘2 సిక్ లైట్ ఇన్ఫాంట్రీ’ హైదరాబాద్ సరిహద్దుల్లోకి చేరుకున్నాయి. ఆగస్టు 1, 1948 నాటికి మొత్తం 28,017 మంది సైనికులు మోహరించారు. పౌర విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోకుండా సైన్యానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్‌లో రజాకర్ల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నిజాం, మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మద్దతుదారులుగా ఉన్న రజాకర్లు గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. జూన్ 1948లో 'ఆపరేషన్ కబడ్డీ' పేరుతో సైనిక బలగాలను అహ్మద్‌నగర్-తుంగభద్ర మార్గంలో మోహరించారు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆపరేషన్ పేరును మొదట ‘ఆపరేషన్ పోలో’గా, ఆ తర్వాత ‘ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్’ గానూ మార్చారు.సెప్టెంబర్ 18, 1948న నిజాం రాజు లొంగిపోయిన తర్వాత.. భారత ప్రభుత్వం ఈ సైనిక చర్యకు అయిన ఖర్చులను లెక్కించింది. రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖల వివరాల ప్రకారం ఈ ‘పోలీస్ చర్య’కు అయిన మొత్తం ఖర్చు రూ.598.76 లక్షలు (సుమారు రూ6 కోట్లు). ఇందులో వైమానిక దళానికి రూ.23 లక్షలు, నేపాలీ కంటింజెంట్‌లకు రూ.34 లక్షలు ఖర్చు అయ్యాయి. ఈ ఖర్చును హైదరాబాద్ ప్రభుత్వమే భరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఐదు రోజుల యుద్ధానికి అయిన ఖర్చును నిజామే భరించాల్సి వచ్చింది. డిసెంబర్ 13, 1949న హైదరాబాద్ ప్రభుత్వం రూ. 3 కోట్లు భారత ప్రభుత్వానికి చెల్లించింది. ఇక ఐదు రోజుల యుద్ధంలో 42 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సైనిక చర్య ద్వారా నిజాం ప్రభువు రూ.6 కోట్ల ఖర్చును మాత్రమే కాకుండా.. 1724 నుంచి కొనసాగిన తన స్వతంత్ర ప్రతిపత్తిని కూడా కోల్పోయారు.