కొత్త జీఎస్టీ విధానం వలన ఏపీ ప్రజలకు ఇంత లాభమా.. ఎన్ని వేల కోట్లంటే?

Wait 5 sec.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. మధ్యతరగతి ప్రజలకు ఊరట నిచ్చేలా అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చాలా వస్తువులను ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి తేవటంతో.. వాటి రేట్లు సెప్టెంబర్ 22 నుంచి తగ్గనున్నాయి. నూతన జీఎస్టీ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో సీఎం నారా నాయుడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీఎస్టీ 2.0కి సంబంధించిన బుక్ లెట్ విడుదల చేశారు. ఈ బుక్ లెట్ పూర్తిగా తెలుగులో రూపొందించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర పన్నుల విధానంపైనా చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలోనే కొత్త జీఎస్టీ విధానం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ.8000 కోట్ల వరకూ ప్రయోజనం కలుగుతుందని ఏపీ వాణిజ్య పన్నులశాఖ చీఫ్‌ కమిషనర్‌ బాబు తెలిపారు.*మరోవైపు చాలా వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్ను తగ్గిందని వివరించారు. అలాగే, పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి వారికి పెద్ద ఊరట లభించిందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చంద్రబాబుకు వివరించారు.*స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్‌ మీద కూడా పన్ను 5 శాతానికి తగ్గిందని.. అలాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారని చంద్రబాబుకు వివరించారు. ఇది రైతులకు భారీగా సహాయపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే, చేనేత, చేతివృత్తుల వారిని ప్రోత్సహించడానికి, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారని వివరించారు. కేంద్రం నిర్ణయంతో ఎగుమతులు పెరగడానికి అవకాశం లభిస్తుందని. సేవా రంగం, హోటల్ వసతులపై జీఎస్టీ తగ్గింపు వలన హోటల్ ఛార్జీలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఫలితంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. *జీఎస్టీ తగ్గింపు వలన ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి, ఉపాధి కల్పనకు బలం చేకూరుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి, కొన్నిమందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించడం మంచి నిర్ణయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొత్తంగా జీఎస్టీ సంస్కరణ ద్వారా వినియోగదారులకు లక్ష కోట్ల వరకు పొదుపు అవుతుందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేశారు.