ఏపీలో ఫుడ్ పార్క్.. రూ.768 కోట్లతో.. ప్రముఖ సంస్థ ఆసక్తి.! ఆ ప్రాంతానికి మహర్దశ..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఏపీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ ఏపీలో తన తొలి ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ వచ్చే మూడేళ్లలో 40 వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే రూ.768 కోట్లతో ఏపీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడెక్ట్స్ కర్నూలు జిల్లాలో ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ నగరానికి, అలాగే బెంగళూరుకు సమాన దూరంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని రిలయన్స్ ఎంచుకున్నట్లు్ తెలిసింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో మూడు గంటలు సమయం పడుతుంది. అలాగే బెంగళూరు వెళ్లేందుకు ఐదు గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన నగరాలతో అనుసంధానంలో ఉండొచ్చనే ఆలోచనతోనే కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణపల్లి వద్ద రిలయన్స్ ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఫుడ్ పార్కులో చాకోలెట్స్, స్నాక్స్, నూడుల్స్, అట్టా, మసాలాలు వంటి వస్తువులు తయారు చేయనున్నారు. మరోవైపు రిలయన్స్ సంస్థ ఫుడ్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నుంచి ఇప్పటికే ఆమోదం లభించింది. రిలయన్స్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం 120 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైప మహారాష్ట్రలోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థ అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏపీలో రిలయన్స్ ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఓర్వకల్లు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.,