413 కోట్ల షేర్లు అమ్మేసిన ఎస్బీఐ.. రూ. 8889 కోట్లకు జపాన్ బ్యాంకుతో డీల్..!

Wait 5 sec.

SBI Completes Divestment: భారతీయ స్టేట్ బ్యాంక్ షేర్ ధర బుధవారం సెషన్‌లో మంచి లాభాల్లో ట్రేడవుతోంది. ఈ వార్త రాసే సమయంలో చూస్తే (మధ్యాహ్నం 2 గంటలకు) 2 శాతానికిపైగా పెరిగి రూ. 851 స్థాయిలో కదలాడుతోంది. ఇంట్రాడేలో రూ. 852.20 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక బ్యాంక్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 7.85 లక్షల కోట్లకు చేరింది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర చూస్తే రూ. 875.45 గా ఉండగా.. కనిష్ట ధర రూ. 680 గా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ 3 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో చూస్తే 17 శాతానికిపైగా ఎగబాకింది. ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు ఇవాళ మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి ఒకే ఒక్క కారణం ఉంది.ప్రైవేట్ రంగానికి చెందిన . అయితే ఇక్కడ అందులోని వాటాను జపాన్‌కు చెందిన సుమిటొమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌కు (SMBC) విక్రయించింది. దాదాపు 13.18 శాతం వాటాను రూ. 8889 కోట్లకు ఆ సంస్థకు అమ్మేసింది. ఇందులో భాగంగా మొత్తం 413.44 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్ ధర రూ. 21.50 చొప్పున విక్రయించింది. 2020లో కేవలం రూ. 10 చొప్పున షేర్లను కొనుగోలు చేయగా ఇప్పుడు షేర్ ధర రెట్టింపు కావడంతో డబుల్ రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. >> యెస్ బ్యాంకులో షేరు కొనుగోలుకు SMBC సంస్థకు 2025, ఆగస్ట్ 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయి. తర్వాత సెప్టెంబర్ 2న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి కూడా ఆమోదం లభించింది. ఎస్బీఐ వాటా విక్రయానికి.. ఎస్బీఐ సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 2025 మేలోనే అనుమతి ఇచ్చింది. జపాన్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా ఉన్న ఎస్ఎంబీసీ.. మొత్తం యెస్ బ్యాంకులో 20 శాతం వాటాను దక్కించుకుంది. ఇందుకోసం రూ. 13,483 కోట్లు వెచ్చించింది. యెస్ బ్యాంకులో ఎస్బీఐకి చెందిన 13 శాతం వాటాకు అదనంగా.. వంటివి కూడా తమ వాటాను కాస్త విక్రయించాయి. ఎస్బీఐకి .. యెస్ బ్యాంకులో ఇప్పటికీ మరో 10.8 శాతం వరకు వాటా ఉంది. కానీ మెజార్టీ షేర్ హోల్డర్‌ హోదాను పోగొట్టుకోనుంది.