భారత్‌పై గెలవాలంటే ఆర్మీ చీఫ్, పీసీబీ చీఫ్ ఓపెనర్లుగా దిగాల్సిందే.. పాకిస్తాన్‌పై ఇమ్రాన్ ఖాన్ మాములు వెటకారం కాదు!

Wait 5 sec.

భారత్‌పై మ్యాచ్ ఆడిన ప్రతిసారీ ఓటమిని చవిచూస్తున్న పాక్‌పై ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం . ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ భారత్‌పై గెలవాలంటే ఆర్మీ చీఫ్, మొహ్సిన్ నక్వీని ఓపెనర్లుగా పంపాలంటూ ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జట్టును ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులతో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్లు షాహీన్ అఫ్రీది, హారిస్ రవుఫ్ మైదానంలో పెద్ద పెద్ద మాటలు చెప్పినా, ప్రదర్శనలో మాత్రం వెనుకబడ్డారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు."ఈ పాక్ జట్టు భారత్‌‌పై గెలవాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు రావాలి" అని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతే కాదు పాక్ గెలవాలంటే అంపైర్లుగా కూడా రాజకీయ, న్యాయ వ్యవస్థ పెద్దలు దిగాలంటూ వెటకారం చేశాడు. మాజీ పాక్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా ఆన్ - ఫీల్డ్ అంపైర్లుగా, ఇక ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ థర్డ్ అంపైర్‌గా ఉండాలన్నాడు.ఈ వ్యాఖ్యలను సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సోదరి అలీమా ఖాన్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్, నక్వీని పలుమార్లు విమర్శిస్తూ ఆయన "అసమర్థత, బంధుప్రీతి కారణంగా పాక్ క్రికెట్‌ను పాడుచేశాడు" అని ఆరోపించాడు. అదేవిధంగా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ గెలుపును 2024 ఫిబ్రవరి ఎన్నికల్లో దొంగిలించాడని కూడా ఇమ్రాన్ తీవ్రంగా ఆరోపించాడు. ప్రారంభం నుంచే పీసీబీ, ఏసీసీ చీఫ్‌గా ఉన్న మొహ్సిన్ నక్వీ వివాదాల కేంద్రమయ్యాడు. భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌తో హ్యాండ్‌ షేక్ చేయకపోవడంతో ఐసీసీకి ఫిర్యాదు చేయడం, రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై అసహనం వ్యక్తం చేస్తూ బహిష్కరణ హెచ్చరికలు ఇవ్వడం వంటివి పీసీబీ వైపు నుంచి వెలువడ్డాయి. అయితే చివరికి పీసీబీనే తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. సూపర్ 4లో తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ సెప్టెంబర్ 23న శ్రీలంకతో తలపడనుంది.