ఏఐతో పెను మార్పులు.. ఈ ఉద్యోగులకే ముప్పు.. చాట్‌జీపీటీ ఫౌండర్ కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

: కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ తన ప్రభావం చూయిస్తోంది. దీంతో.. ఏఐ ఎప్పటినుంచో ఉద్యోగుల్ని భయపెడుతోంది. ఆటోమేషన్‌తో.. ఇది ఉద్యోగుల్ని భర్తీ చేస్తుందన్న భయాలు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకే పలు రంగాల్లో మానవ ప్రమేయం ఉండాల్సిన విధుల్ని కూడా ఏఐ ద్వారా భర్తీ చేసిన కంపెనీలు ఉన్నాయి. ఏఐ వినియోగం పెంచుకుంటున్న కంపెనీలు.. ఉద్యోగుల్ని తొలగించిన సందర్భాల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా ఐటీ/టెక్, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉద్యోగులపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంతకుముందు ఒకసారి.. . ఇప్పుడు మరోసారి ఇదే విషయమై మాట్లాడారు. కృత్రిమ మేధతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో భారీ మార్పులు జరుగుతున్నాయని అన్నారు. ఏఐ కారణంగా ముందుగా.. కస్టమర్ సర్వీస్, ప్రోగ్రామింగ్ ఉద్యోగాలే ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఏఐ కారణంగా.. ఎలాంటి ఉద్యోగాలు భర్తీ అవుతాయి.. ఏ ఉద్యోగాల్లో కచ్చితంగా మానవ ప్రమేయం ఉండాలనే విషయంపై.. ది టక్కర్ కార్ల్‌సన్ అనే ఒక షోలో మాట్లాడారు ఆల్ట్‌మన్. కంప్యూటర్ ప్రోగ్రామర్ భవిష్యత్తు గురించి ఇంత ముందుగా అంచనా వేయలేమని చెప్పారు. ప్రోగ్రామర్ పాత్ర.. రెండేళ్ల కిందటితో పోలిస్తే పూర్తిగా మారిందని అన్నారు సామ్. ఏఐని ఉపయోగించుకొని.. ప్రోగ్రామర్స్ తమ సామర్థ్యాల్ని మరింత పెంచుకుంటున్నారని చెప్పారు. ఆటోమేటెడ్, ప్రాంప్ట్ టూల్స్ వాడకంతో కోడింగ్ మరింత సులభతరం అవుతున్నప్పటికీ.. ప్రోగ్రామర్లపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో చెప్పడం కష్టమని చెప్పారు. ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పుకొచ్చారు. >> అయితే.. కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ఎక్కువ శాతం .. కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కచ్చితంగా ఏఐతో భర్తీ అవుతాయని స్పష్టం చేశారు సామ్ ఆల్ట్‌మన్. ఇక్కడ ఏఐ మనుషుల కంటే వేగంగా సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ సున్నితమైన సమాధానం, సానుభూతి, హామీ ఇవ్వడం వంటి మానవీయ కోణం కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల్లో మాత్రం.. అంతగా ప్రభావం చూపించకపోవచ్చని స్పష్టం చేశారు.మరోవైపు.. వైద్య సేవలకు సంబంధించి.. రోగులకు మానవీయ సంబంధం తప్పనిసరి కాబట్టి.. నర్సుల ఉద్యోగాలు ఏమాత్రం ప్రభావిత కాబోవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రోబోట్ ఎంత మంచి సలహా ఇచ్చినప్పటికీ.. నర్సు స్థానంలో రోగులకు మనిషే కావాలని అన్నారు. భవిష్యత్తు గురించి ఎవరూ ముందుగానే కచ్చితంగా చెప్పలేరని.. అందుకోసం ఏఐకి అధిక డిమాండ్ ఉన్న రంగాల్ని గుర్తించాలని.. మనుషుల్ని భర్తీ చేయలేని రంగాలేవో తెలుసుకోవాలని చెప్పారు.