HYD హుస్సేన్‌సాగర్‌ నయా లుక్‌.. సాగర తీరంలో స్కై వాక్, సైకిల్ ట్రాక్‌, మల్టీ లెవెల్ పార్కింగ్‌

Wait 5 sec.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 'తెలంగాణ రైజింగ్ కోర్ - అర్బన్ ఏరియా' అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్య సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను గుర్తించి, వాటిని మూడు కేటగిరీలుగా విభజించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు, 5 నుంచి 8వ తరగతి వరకు, 9 నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యా శాఖను ఆదేశించారు. కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలలకు అధునాతన భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు.నగరానికి 'క్లీన్ సిటీ' ఇమేజ్‌ను తీసుకురావాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేయడానికి రోబోటిక్ యంత్రాలను వాడాలని సూచించారు. చెరువులు, కుంటల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని, గూగుల్ సహకారంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే ప్రణాళికను అమలు చేయాలని పోలీసు విభాగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని, సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో సోలార్ విద్యుత్తును వాడాలని సూచించారు.హుస్సేన్‌సాగర్‌ నయా లుక్‌హైదరాబాద్‌కు గర్వకారణంగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను 'హుస్సేన్‌సాగర్ 2.0' పేరుతో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మల్టీ లెవెల్ పార్కింగ్‌ను నిర్మించాలని అన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్‌ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.హైదరాబాద్‌ను 'డ్రగ్ ఫ్రీ సిటీ'గా మార్చడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ వాడేవారిని బాధితులుగా కాకుండా, నిందితులుగా పరిగణించి పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచాలని సూచించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ కేంద్రాన్ని నిర్మించాలని పేర్కొన్నారు.