పోటీ ఎక్కడుందీ.. పాకిస్తాన్ స్థానం అదే! దాయాదిని తీసిపడేసిన సూర్యకుమార్ యాదవ్!!

Wait 5 sec.

కు కెప్టెన్ మాటలు పుండు మీద కారం చల్లినట్లయ్యాయి. ప్రతిసారీ పోటీ, ఇండియా - పాక్ వైరం ఇలాంటి మాటలు వింటుంటే కాస్తంత అతిశయోక్తిగా ఉంటుంది.. ఎందుకంటే అసలు పోటీ ఎక్కడుంది అంటూ దాయాదిని స్కై తీసిపడేశాడు. పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిపడేశాడు. 2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీని సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో వన్ సైడ్‌గా మ్యాచ్ జరగ్గా.. సూపర్ 4లో మాత్రం పాకిస్తాన్ గట్టిపోటీనే ఇచ్చింది. అయితే, టీమిండియా ఓపెనర్లు ముఖ్యంగా అభిషేక్ శర్మ విరుచుకుపడటంతో భారత్‌కు సునాయాస విజయం అందింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాను దాయాది బౌలర్లు రెచ్చగొట్టడంతో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్‌‌పై సూర్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశాడు. భారత్ - పాక్ మ్యాచ్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ సూటిగా సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా ఓ పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు అతను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఇకపై ఈ రైవల్రీ అనే దాని గురించి అడగడం మానేయడం ఆపేయాలి అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. "రైవల్రీ అనిపించాలంటే.. రెండు జట్లు 15 - 20 మ్యాచ్‌లు ఆడితే 7 -7, 8 - 7 ఇలా అటూఇటుగా ఉండాలి. అలా కాకుండా 13 - 0, 10 - 1గా ఉంటే దాన్ని ఎలా రైవల్రీ అంటారు? అసలు గణాంకాలు నాకు తెలియదు. కానీ మేము వారికంటే 7 -15 మధ్య మంచి క్రికెట్ ఆడాం, బౌలింగ్ కూడా మెరుగ్గా చేశాం" అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. భారత్ - పాక్ ఆడిన గత ఏడు మ్యాచ్‌లలోనూ పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన ఏడింటిలోనూ భారత్ విజయాలు సాధించడం విశేషం. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఈ రెండు జట్లు పాల్గొన్న ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం. ఈ కారణంగానే సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జర్నలిస్టుకు అలాంటి సమాధానం చెప్పాడు. అయితే ఓవరాల్‌గా భారత్ - పాక్ మధ్య జరిగిన పోరులో దాయాదిదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మధ్య జరిగిన 210 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్ 88 విజయాలు సాధించగా, భారత్ 78 మ్యాచ్‌లు గెలిచింది. టెస్టుల్లో 59 మ్యాచ్‌లు ఆడితే పాక్ 12, భారత్ 9, మిగతా 38 డ్రాగా ముగిశాయి. వన్డేల్లో భారత్ 58, పాకిస్తాన్ 73 విజయాలు సాధించింది. టీ20ల్లో మాత్రం టీమిండియాదే పైచేయి 15 మ్యాచ్‌లు ఆడితే అందులో పాక్ కేవలం మూడు మాత్రమే గెలిచింది. భారత్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది.