ఒకటి, రెండూ కాదు.. ఒకేసారి 5 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. కారణమిదే

Wait 5 sec.

: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, , ఇతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు.. ఇలా అన్నింటికీ (RBI) నియంత్రణ సంస్థగా ఉంటుంది. వీటిన్నింటిపైనా నియంత్రణాధికారం కేంద్ర బ్యాంకుదే అన్నమాట. ఇక్కడ అన్నీ ఆర్బీఐ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అయితే.. ఇటీవల కొన్ని సంస్థలు.. తమ పరిధిని అతిక్రమించి దురుసుగా ప్రవర్తిస్తున్నాయి. తమ సంస్థల్లో జరిగే లోపాల్ని, ఇతర ఉల్లంఘనల్ని ఆర్బీఐకి తెలియజేయడంలో విఫలమవుతున్నాయి. దీంతో.. సాధారణంగా.. ఆర్బీఐ పలు సంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాల్ని జారీ చేస్తుంటాయి. వీటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీంతో.. ఇక్కడ నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇటీవల ఇది ఎక్కువైంది. ఎక్కువగా కోఆపరేటివ్ బ్యాంకులు, సహకార బ్యాంకులు వంటివి ఈ ఆంక్షలకు గురవుతుంటాయి. సమస్య తీవ్రంగా ఉంటే.. లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో 5 సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. >> ముందుగా మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా పనిచేసే.. చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. దీనిపై రూ. 4.50 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం- 1949, సెక్షన్ 26A కింద నిబంధనల్ని ఉల్లంఘించింది. ఆర్బీఐ ఇష్యూ చేసిన నో యువర్ కస్టమర్ (kyc) మార్గదర్శకాల్ని పాటించడంలో విఫలమైంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEA Fund) కింద అన్‌క్లెయిమ్డ్ నగదును నిర్దేశిత సమయంలో పంపలేదని గుర్తించింది. ఇంకా ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే భారత్ కోఆపరేటివ్ బ్యాంకుపై రూ. 3.75 లక్షల ఫైన్ పడింది. ఇక్కడ అసాధారణ సైబర్ సెక్యూరిటీ సంఘటనల గురించి ఆర్బీఐకి నివేదించలేదు. ఇది ఒక రకంగా నిబంధనల్ని ఉల్లంఘించడమే. ఇక్కడ ఐటీ వ్యవస్థ అంతరాయాలతో కస్టమర్లకు అందించే సేవల్లో జాప్యం ఎదురైంది. జలగావ్ డీసీసీ బ్యాంకుకు రూ. 3.50 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్‌కు సంబంధించి.. నియంత్రణ పర నిబంధనల్ని ఉల్లంఘించింది. యావత్మాల్ డీసీసీ బ్యాంకుపై రూ. 1 లక్ష ఫైన్ విధించింది. ఇక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్ అందించింది. మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంకుపై రూ. 23 వేల జరిమానా పడింది. ఇక్కడ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సభ్యత్వానికి సంబంధించి.. ఆర్బీఐ ఆదేశాల్ని పాటించలేదు. 2024, మార్చి 31లోగా.. రుణ గ్రహీతలకు ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని చేరవేయడంలో కూడా విఫలమైందని తెలిపింది.