మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పతనంతో ఇబ్బందులు పడుతున్న ఉల్లి రైతులకు ఆర్థిక భరోసా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉల్లిని క్వింటా రూ.1200 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. ఉల్లి రైతుల కోసం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉల్లిని పండించిన ప్రతి రైతుకు హెక్టార్‌‌కు 50 వేల రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉల్లిని ఎవరకు అమ్మారు, ఎంత ధరకు అమ్మారనే విషయంతో సంబంధం లేకుండా ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ సాయంలో.. కేంద్ర ప్రభుత్వం హెక్టారుకు రూ.17.500 చెల్లించనుంది. వైపరీత్యాల నిధుల కింద ఈ సాయం అందిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెక్టారుకు రూ.32,500 సాయం అందిస్తారు. మొత్తంగా హెక్టారుకు రూ.50000 సాయం అందనుంది. నేరుగా ఉల్లి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ చేయనున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులపై ఇప్పటికే అధికారుల సర్వే పూర్తైనట్లు సమాచారం. సర్వేల ఆధారంగా అర్హులైన రైతులకు సాయం అందిస్తారు. కర్నూలుతో పాటుగా, కడప, అనంతపురం జిల్లాల్లో ఉల్లిని ఎక్కువగా పండించారు. అయితే పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని లబోదిబోమంటున్నారు.ఉల్లిని కొనడానికి వ్యాపారస్తులు ముందుకు రాకపోవటంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోనే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉల్లి రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం. చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా ఉల్లి రైతుల నుంచి కొనుగోలు చేస్తే. మిగతా మొత్తాన్ని మార్క్ ఫెడ్ రైతులకు చెల్లించనుంది. అలాగే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని రైతుబజార్లకు తరలించి.. విక్రయించనున్నారు. మిగతా ఉల్లిని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు. అయితే బహిరంగ వేలంలో ఉల్లి కిలో రూపాయి కూడా పలకని పరిస్థితి మొన్నటి వరకూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకునేందుకు ఉల్లి రైతులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెక్టారుకు రూ.50 వేలు చొప్పున అందించనుంది.