Asia Cup: నబీ చేతిలో ఐదు సిక్సర్లు బాదించుకున్నాడు.. ఆ తర్వాత శ్రీలంక ఆటగాడికి ఊహించని విషాదం!

Wait 5 sec.

వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. అయితే, నబీ సిక్సర్లు బాదిన అదే బౌలర్‌కి మ్యాచ్ తర్వాత ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సూపర్ 4 ముందు జరిగిన కీలక మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ ఓడిపోగా.. శ్రీలంక విజయ సాధించింది.శ్రీలంక జట్టు విజయ సంబరాలు చేసుకుంటున్న సమయంలో యువ క్రికెటర్ పుట్టెడు దు:ఖంతో కుమిలిపోయాడు. కొలంబోలో తన తండ్రి సురంగ వెల్లలాగే ఆకస్మిక మరణం చెందాడు. అయితే, టీమ్ అధికారులు ఈ విషయాన్ని దునిత్‌కు మ్యాచ్ అనంతరం చెప్పారు. దాంతో వెంటనే అతను ఫీల్డ్‌ను వదిలి తన తండ్రిని ఆఖరి చూపు చూసుకోవడానికి శ్రీలంక బయల్దేరి వెళ్లాడు. గతంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో దునిత్ 5/27తో మంచి ప్రదర్శన ఇచ్చి శ్రీలంక జట్టులో శాశ్వత ఆటగాడిగా స్థానం నిలుపుకున్నాడు. కేవలం బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 22 ఏళ్ల వెల్లలాగే తండ్రి వార్తను తెలుసుకోగానే ఒక్కసారిగా కృంగిపోయాడు. శ్రీలంక క్రికెటర్లతో పాటు అప్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ కూడా సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శ్రీలంక సూపర్ 4లో అడుగుపెట్టిన ఈ సమయంలో దునిత్ వెల్లలాగే ఆటలో కొనసాగుతాడా? లేదా? అంటూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్‌తో జరిగే కీలక పోరులో వెల్లలాగే అవసరం కచ్చితంగా ఉంది. గ్రూప్ స్టేజ్‌లో శ్రీలంక జట్టు వరుసగా మూడు విజయాలతో స్టాండింగ్ విక్టరీని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్‌లో అప్ఘనిస్తాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒకానొక దశలో 130లోపే పరిమితం అవుతుంది అనుకున్నారు. కానీ మహమ్మద్ నబీ 22 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 60 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేయగలిగింది. శ్రీలంక జట్టు ఓపెనర్ నిస్సంకా, మిషారాను తక్కువ పరుగులకే కోల్పోయినప్పటికీ కుశాల్ మెండీస్ 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.