సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి గంపగుత్తగా 2,856 ఫ్లాట్లను వేలం వేయబోతుంది. అవి కూడా త్రీ బీహెచ్‌కే డీలక్స్, ట్రిపుల్ బెడ్‌రూమ్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్స్ ఫ్లాట్లను వేలం వేయబోతున్నారు. మొత్తం 47 ఎకరాల్లో.. 17 టవర్లలో నిర్మించిన . దీనిలో 19 ఎకరాల ఖాళీ స్థలం కూడా ఉంది. టవర్లు, ఖాళీ ల్యాండ్‌ను కలిపి మొత్తం 550 కోట్ల రూపాయలకు అమ్మేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. అయితే ఈ ఫ్లాట్లను ఒక్కొక్కటిగా విడిగా అమ్మకుండా గంపగుత్తగా అమ్మాలని భావిస్తున్నారు. అంటే ఈ మొత్తం టవర్లని ఏదైనా కంపెనీ సొంతం చేసుకుని.. ఆ తర్వాత ఒక్కో ఫ్లాట్‌ని విడిగా అమ్ముకుంటుంది.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్‌లో 47 ఎకరాల్లో ఉన్న 17 రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. వారంలోగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్లను వేరుగా, ఖాళీ జాగాను విడిగా అమ్మాలని భావిస్తున్నారు. మొత్తం 17 టవర్లలో 2,856 ఫ్లాట్లు ఉండగా.. వీటిల్లో 840 త్రీబీహెచ్‌కే ఫ్లాట్లు కాగా, మరో 840 త్రీబీహెచ్‌కే ఫ్లాట్లు, 336 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, సింగిల్ బెడ్రూం ఫ్లాట్లు 840 ఉన్నాయి. అలానే ఈ టౌన్‌షిప్‌కు వెళ్లేందుకు 100 ఫీట్ల రోడ్డును కూడా నిర్మించారు. ఇటీవలే ఓ కంపెనీ రూ.300 కోట్లకు ఈ టవర్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలం నుంచి రాష్ట్రంలో ఉన్న కమర్షియల్ ప్రాంతాలను, రాజీవ్ స్వగృహ టవర్లను, హౌసింగ్ బోర్డు ఖాళీ జాగాలను వేలం వేస్తుంది. వీటి వేలం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్లు పథకానికి వినియోగిస్తున్నారు. ఇక ప్రభుత్వం వేలం వేసిన ఆస్తుల్లో.. కూకట్‌పల్లిలో 7.8 ఎకరాల స్థలాన్ని గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ.547 కోట్లకు కొనుగోలు చేసింది. అలానే పోచారం, బండ్లగూడలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను అమ్మారు. , పోచారంలో ఉన్న టవర్లకు ఈ నెల 25న లాటరీ తీయనున్నారు. హైదరాబాద్‌తో పాటుగా ఖమ్మంలో ఉన్న టవర్లను కూడా వేలం వేశారు. వీటికి రూ.87.41 కోట్లు చెల్లించి తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు కొనుగోలు చేశారు. అలానే గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్టీపీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎఫ్‌సీఐ ఉద్యోగుల అసోసియేషన్ మూడు కలిసి.. పోచారంలో ఇటీవల వేలం వేసిన మూడు టవర్లను రూ.70.11 కోట్లకు కొనుగోలు చేశాయి.ఇదిలా ఉంటే ఇటీవల హౌసింగ్ బోర్డు.. రంగారెడ్డి డిస్ట్రిక్ రావిర్యాల, మేడ్చల్ జిల్లా చింతల్‌లో కమర్షియల్ ప్లాట్ల వేలానికి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు.. వచ్చేనెల అనగా అక్టోబర్ 8, 9 తేదీల్లో ఎంఎస్‌టీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలానే గజానికి రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ వచ్చే నెల అనగా అక్టోబర్ 9,10 తేదీల్లో ఈ ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్, చింతల్‌లో 2.25 ఎకరాల కమర్షియల్ ప్లాట్‌కు సంబంధించి గజం రూ.72 వేలుగా అధికారులు ధర ఖరారు చేశారు. అలానే చింతల్‌లోనే వేరే ప్రాంతంలో 3,388 గజాల కమర్షియల్ ప్లాట్‌కు సంబంధించి గజం ధరను రూ.60వేలుగా నిర్ణయించారు.