రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ధురంధర్’ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయింది. మూడు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. డిసెంబర్ 11 నాటికి రూ.252 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నిన్న శుక్రవారం ఒక్క రోజే రూ.34.70 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రెండో శుక్రవారం నాడు 'పుష్ప 2: ది రూల్', 'ఛావా', 'యానిమల్', 'గదర్ 2', 'బాహుబలి 2' చిత్రాలను క్రాస్ చేసి, సరికొత్త రికార్డు సృష్టించిందని అంటున్నారు. () హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాలు సృష్టించిందో మనం చూశాం. అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. రూ.800 కోట్లకు పైగా నెట్ తో హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా చరిత్ర తిరగరాసింది. ఇక రెండో శుక్రవారం హిందీలో రూ. 27.50 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇప్పుడు ‘ధురంధర్’ సినిమా దాన్ని అధిగమించినట్లు తెలుస్తోంది. రెండవ శుక్రవారం హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ‘ధురంధర్’ (₹ 34.70 కోట్లు) టాప్ లో నిలిస్తే.. 'పుష్ప 2' (₹ 27.50 కోట్లు), 'ఛావా' (₹ 24.03 కోట్లు), 'యానిమల్' (₹ 23.53 కోట్లు), 'గదర్ 2' (₹ 20.50 కోట్లు), 'బాహుబలి 2' (₹ 19.75 కోట్లు) చిత్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ వీకెండ్ తో 'ధురంధర్' మూవీ రూ. 300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.*