పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి ఎదురైంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు బీటెక్ రవి అక్కడకు వెళ్లారు. అయితే బీటెక్ రవి రాకతో అమ్మగారిపల్లి గ్రామస్తులు.. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు. బీటెక్ రవి వస్తున్నారనే విషయం తెలుసుకుని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమ్మగారిపల్లి గ్రామం మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ వస్తోంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని కుటుంబాలు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో వారికి కండువా కప్పేందుకు బీటెక్ రవి వెళ్లగా.. ఇలా చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల జరిగిన సైతం ఇదే రీతిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ.. . ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నియోజకవర్గంలో టీడీపీని మరింత పటిష్టపరిచేందుకు బీటెక్ రవి ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి కాలనీ నుంచి30 కుటుంబాలు టీడీపీలో చేరాయి.వైసీపీ నేత సాయికుమార్‌తో పాటు 30 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి. తాజాగా అమ్మగారిపల్లె గ్రామంలోనూ కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధపడగా.. గ్రామస్థులు మాత్రం తమ నిరసన ఇలా వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతోందంటున్నారు బీటెక్ రవి. ఈ కారణంగానే పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని అంటున్నారు. వైఎస్‌ కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ పులివెందుల జనం తాగునీటి సమస్యను తీర్చలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.