ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి () నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని.. కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తస్తూ.. గత రెండు సంవత్సరాలుగా 'విద్యార్థులకు నాణ్యమైన విద్య' అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. శనివారం నాడు హైటెక్స్‌లో బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. టెక్నాలజీ, విద్య కలిసి భవిష్యత్తును నిర్మించడంలో ఇలాంటి వేదికలు కీలకం అని ఆయన అన్నారు.‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలలో ఏర్పాటు ఒకటి. కుల, మత భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ (SC, ST, BC, Minority) విద్యార్థులందరూ ఒకే క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి చదువుకునేలా ఈ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఏకంగా రూ. 21,000 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. ప్రతి పాఠశాలను 25 ఎకరాల విశాల ప్రాంగణంలో.. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగంలో మార్పులతో పాటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో... 2024 డీఎస్సీ ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది.2024 సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ. 140 కోట్ల వ్యయాన్ని భరిస్తోంది. 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు' కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ. 642 కోట్ల వ్యయంతో 59 వేల మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశారు. పాఠశాలల శుభ్రత, నిర్వహణ బాధ్యతలను AAPCsకి అప్పగిస్తూ సుమారు రూ. 146 కోట్ల నిధులు కేటాయించారు.యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించనుంది. యువతకు మెరుగైన నైపుణ్యాలు నేర్పేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేస్తున్నారు.విద్యతో పాటు క్రీడలకు (Sports) కూడా ప్రాధాన్యత ఇస్తూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. ఈ అన్ని చర్యల ద్వారా విద్యార్థులకు విస్తృత అవకాశాలు, యువతకు ఉపాధి బలం.. రాష్ట్రంలో వృత్తి ఆధారిత విద్యకు బలమైన పునాది పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.