బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. ఏపీలో 'లేడీ డాన్‌'గా ఎలా మారింది?

Wait 5 sec.

ఐటీ రంగంలో కొలువు.. చక్కగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. అది కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కేరాఫ్ అడ్రస్ అయిన బెంగళూరులో.. వారంలో ఐదు రోజుల పని.. రెండ్రోజుల వీకాఫ్.. వీకెండ్స్‌లో పబ్బులు, పార్టీలు. డిస్కోలు అంటూ ఛిల్ అవ్వలేదా ఆ యువతి. ఇది కాదు ఇంకా కావలనుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బోర్ కొట్టిందో.. జస్ట్ ఫర్ ఛేంజ్ అనుకుందో.. రూటు మార్చింది.. గేరు మార్చింది.. బెంగళూరులో మహిళా టెకీ కాస్తా.. ఏపీలో " అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..అనకాపల్లి జిల్లాలోని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళ కూడా ఉంది. నర్సీపట్నం నుంచి తమిళనాడు, శ్రీలంకకు.. శీలావతి రకం గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నారనే కారణంతో ఈ ఎనిమిది మందిని నాతవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని.. శ్రీలంకకు తరలిస్తూ పట్టుబడటం ఇదే తొలసారని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈవెనుక ఓ మహిళా టెకీ పాత్ర ఉందని పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్ చేసిన వారిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ఉంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన 28 ఏళ్ల గాదె రేణుక అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గాదె రేణుక బీటెక్ చదివి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గాదె రేణుక రూటు మార్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి.. గంజాయి స్మగ్లింగ్ ప్రారంభించారు.పాయకరావుపేట, నర్సీపట్నం, సాలూరు, బెంగుళూరు ప్రాంతాలలో రేణుక గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక కాస్తా లేడీ డాన్‌గా పేరు సంపాదించుకున్నట్లు వెల్లడించారు. రేణుక, ఆమె సహచరుడు సూర్య కాళిదాస్, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి తమిళనాడు, శ్రీలంకకు సరఫరా చేయడానికి నర్సీపట్నంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో.. సృగవరం గ్రామం సమీపంలో ఆ ముఠాను అడ్డగించి.. అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 74 కిలోల ఎండు గంజాయి, ఒక కారు, రెండు బైక్‌లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తమ గంజాయి వ్యాపారాన్ని విస్తరించడానికి రేణుక.. బెంగళూరు, కోయంబత్తూరులో ఇళ్లను అద్దెకు తీసుకుని ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అద్దూరి ప్రసాద్ అనే మధ్యవర్తి సాయంతో ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల, చిత్రకొండ ప్రాంతాలలో కిలో 5 వేల రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేస్తూ.. మదన్ కుమార్, నాగముత్తు అనే ఇద్దరు డ్రైవర్ల సాయంతో ఈ సరుకును రాజానగరం హైవే జంక్షన్ వద్దకు చేర్చేవారని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి తమిళనాడు, శ్రీలంకకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణా మాత్రమే కాకుండా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తమిళనాడులో గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రేణుకకు మిగతా స్మగ్లర్లతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.