ఆవకాయ అమరావతికి బిగ్ షాక్.. ఆదిలోనే ఇదేంటబ్బా?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు నిర్వహించాలని ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇటీవలే ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ,పున్నమి ఘాట్‌లో ఆవకాయ్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నృత్యం, కవిత్వం, సంగీతం, సినిమా సాహిత్యం వంటి విభాగాలలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది.పున్నమిఘాట్‌లో ఆవకాయ్ అమరావతి ఉత్సవాల నిర్వహణకు ప్రైవేట్ భూయజమానులు అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం నిర్వహిస్తారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు... నోటీసులు ఇవ్వకుండానే తమ స్థలాల్లోని గోడలు పగలగొట్టడంపై మండిపడుతున్నారు. పున్నమి ఘాట్‌లో 20 ఎకరాల వరకూ ప్రైవేట్ పట్టా భూమి ఉందని.. తమ భూమిని కాపాడుకోవడానికి కట్టుకున్న గోడలు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నామంటున్న ప్రైవేట్ భూ యజమానులు.. తమ భూములలోఅవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహణకు తమను సంప్రదించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిబిషన్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని.. నోటీసులు ఇవ్వకుండానే పడగొడతారా అని ప్రశ్నిస్తున్నారు. తమ భూములకు హద్దులు వేసుకుని పరిరక్షించుకుంటామంటున్నారు. 20 ఏళ్లుగా తమ స్థలాలను వాడుకుంటూ రూపాయి కూడా ఇవ్వడం లేదని.. ప్రైవేట్ భూములలో కార్యక్రమాలు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. తమకు సహకరిస్తే.. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వ చర్యలపై అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. మరోవైపు జనవరి 8వ తేదీ నుంచి పదో తేదీ వరకూ మూడు రోజుల పాటుఈ ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటికి ప్రవేశం ఉచితంగా కల్పిస్తున్నారు. ఆవకాయ్ ఉత్సవంలో భాగంగా సంగీత, నాటక ప్రదర్శనలు, సినిమా–సాహిత్య చర్చలు, వర్క్‌షాపులు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.