ఏపీలో భూ సమస్యలకు పరిష్కారం.. కొత్తగా రెవెన్యూ క్లినిక్‌లు.. ఒక్క రోజులోనే

Wait 5 sec.

కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద తలనొప్పిగా మారిన భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ రెవెన్యూ క్లినిక్ భూ సమస్యల పరిష్కారంలో మంచి ఫలితాన్ని ఇవ్వడంతో, ఈ ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇకపై ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసి, ప్రజల అర్జీలకు పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.దీనిలో భాగంగా గ్రీవెన్స్ డే అంటే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, భూ తగాదాలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు. ఈ డెస్క్ ప్రతి సోమవారం వచ్చే అర్జీలతో పాటు, సాధారణంగా కలెక్టరేట్‌కు వచ్చే విన్నపాలను కూడా పర్యవేక్షిస్తుంది. పట్టాదారు పాస్‌పుస్తకం, 1/70, ఆర్‌ఓఆర్ (Record of Rights), ఆర్‌ఓఎఫ్‌ఆర్ (Record of Forest Rights), రీసర్వే.. ఇలాంటి మొత్తం 14 రకాల సమస్యలుగా అర్జీలను విభజించాలి. ఈ ప్రకారం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి, వాటివద్ద సిబ్బందిని ఉంచాలి. సమస్య ఏ విభాగానికి చెందినదో గుర్తించి, అర్జీదారుల్ని ఆ టేబుల్‌ వద్దకే పంపాలి.ప్రతి అర్జీకి ఒక ఆన్‌లైన్‌ నంబర్ కేటాయిస్తారు. దీనితో పాటు దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ నంబర్‌లను కూడా నమోదు చేస్తారు. అర్జీని స్వీకరించాక.. దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారుకు అందిస్తారు. ఈ కాపీలో సమస్య తీవ్రత, పరిష్కారమయ్యే సమయం వంటి వివరాలు ఉంటాయి. అనంతరం దీనిపై డిప్యూటీ కలెక్టరు సంతకం చేస్తారు. ఈ రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు వీలు కాకపోతే, ఎంత సమయం పడుతుందో నిర్దిష్ట గడువు విధించి, ఆ లోపు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.మొదట డెస్క్ స్థాయిలో అర్జీని పరిశీలిస్తారు. ఆ తర్వాత దానిని సంబంధిత తహసీల్దార్‌కు పంపిస్తారు. అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్, సీనియర్ అధికారుల సమీక్షించిన తర్వాత సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారంపై ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు.ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారం కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు అమలు చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం చాలా మంచి నిర్ణయం. ఇప్పటికే ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు.