రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ యశ్ దయాల్‌ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జైపూర్ పోక్సో కోర్టు బుధవారం (డిసెంబర్ 24) తిరస్కరించింది. పోక్సో కేసు అత్యంత తీవ్రమైనదని కోర్టు చెప్పింది. మైనర్‌కు సంబంధించిన విషయం కావడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. అతన్ని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వడానికి కూడా పోక్సో కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో యశ్ దయాల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయగా కోర్టు ఈ మేరకు స్పందించింది. ఏంటీ ఈ కేసు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. జైపూర్‌లో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో యశ్ దయాల్‌ను కలిసింది ఓ బాలిక. తనకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తి గురించి అతడితో చెప్పింది. అయితే దయాల్ తనకు గైడెన్స్ ఇస్తానని చెప్పి.. స్థానిక హోటల్‌కు ఆహ్వానించాడని.. తొలిసారి అత్యాచారం చేసింది కూడా అప్పుడేనని బాలిక ఫిర్యాదులో ఆరోపించింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు తనపై యశ్ దయాల్ అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ప్రస్తుతం బాలిక వయస్సు 18 సంవత్సరాలు అయినప్పటికీ తొలిసారి అత్యాచారానికి గురైనప్పుడు 17 ఏళ్లే కావడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే.. ఆర్సీబీ బౌలర్‌కు 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కాగా, ఇదే కాకుండా గతంలో యశ్ దయాల్‌పై ఘజియాబాద్‌లో కూడా ఓ కేసు నమోదైంది. ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడాని ఉజ్వల సింగ్ అనే అయితే ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్‌ను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధితురాలికి కూడా కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.ప్రస్తుతం ఈ రెండు కేసులపై విచారణ కొనసాగుతోంది. ఘజియాబాద్‌లో కేసులో అతను అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఊరట లభించింది. కానీ జైపుర్ కేసులో తాజాగా కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ యశ్ దయాల్ కూడా కౌంటర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తైన తర్వాత అసలు నిజయం బయటపడనుంది.