సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ కానుక.. వాటి కోసం రూ.30 వేల చొప్పున.. రూ.33 కోట్లు కేటాయింపు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి() పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దీపక్‌ జాన్‌ పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7,000 చర్చిలకు పండుగ ఖర్చుల నిమిత్తం మొత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ప్రతి చర్చిలోనూ అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమని గుర్తు చేశారు. మిరాకిల్ మంత్ గా డిసెంబర్ నెల.. జన్మించింది డిసెంబర్ నెలలోనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది కూడా డిసెంబర్ నెలలోనే.. అందుకే కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్ గా పేర్కొన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ప్రసాదించిన సోనియా గాంధీ త్యాగం వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. ఏసుప్రభువు బోధించిన శాంతి, ప్రేమ మార్గంలోనే తమ ప్రభుత్వం నడుస్తోందని సీఎం తెలిపారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ‘హేట్ రేట్’ (Hate Rate) చట్టాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. దేశంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో సమానంగా కృషి చేశాయని, సగటు మనిషి జీవన ప్రమాణం పెరగడంలో వారి పాత్ర కీలకమని ప్రశంసించారు. రైతులకు రూ. 1.04 లక్షల కోట్ల ఖర్చు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, పంపిణీ, వంటి పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని పంచుకున్నారు.