భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు ముందు.. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా ఇదే జట్టు ఆడనుంది. అయితే వరల్డ్ కప్‌ జట్టులో టీమిండియా పెద్ద దుమారమే చెలరేగింది. రెండు వర్గాలుగా విడిపోయి క్రికెట్ అభిమానులు వాదోపవాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్‌ మెంబర్లు కాకుండా.. మిగిలిన ప్లేయర్లతో బుధవారం (డిసెంబర్ 24) భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా ఒక ఆల్టర్నేటివ్ జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులోనూ శుభమన్ గిల్‌కు చోటు దక్కలేదు. పూర్తి ఆల్టర్నేటివ్ జట్టు ఇదేకాగా, టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ జట్టు ప్రకటించిన సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం.. ఫామ్ కోల్పోయిన బ్యాటర్ గిల్‌ను పక్కన పెట్టడం. ఈ ఏడాది ఆసియా కప్‌కు ముందు భారత టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్‌గా వచ్చిన గిల్.. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. గిల్ 15 ఇన్నింగ్స్‌లు ఆడి 24.25 సగటుతో, 137-పైగా స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. అతని పేలవ ఫామ్ కారణంగా.. టీ20 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక చేసేటప్పుడు సెలెక్టర్లు అతన్ని పక్కకు పెట్టారు. గిల్‌ స్థానంలో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది భారత టీ20 జట్టులో మంచి ప్రదర్శన చేసింది. టీమిండియా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన గిల్ ప్రదర్శన చూసి.. సెలెక్టర్లు అతడ్ని టీ20 జట్టులోకి తీసువాలని నిర్ణయించుకున్నారు. దీంతో గిల్ ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చి.. ఓపెనింగ్ స్థానంలో సంజు శాంసన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే ఓపెనర్‌గా సంజు మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ.. అతడిని తొలగించారు. ఈ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, న్యూజిలాండ్‌తో భారత్ తలపడే ఐదు టీ20ల సిరీస్ జనవరి 21న ప్రారంభమై.. అదే నెల 31న ముగుస్తుంది. అనంతరం కేవలం ఆరు రోజుల విరామం తర్వాత.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తన టీ20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో తలపడుతుంది. ఆకాష్ చోప్రా ఆల్టర్నేటివ్ వరల్డ్ కప్ జట్టు:రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జితేష్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్.