నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు హైదరాబాద్‌వాసులు మృతి

Wait 5 sec.

జరిగింది. నేషనల్ హైవేపై ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల-బత్తలూరు మధ్య తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు (క్వాలిస్) అదుపుతప్పి డివైడర్‌ను దాటి.. ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో చనిపోయినవారంతా హైదరాబాద్‌కు చెందినవారిగా చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ . కారులో ప్రయాణిస్తున్న వీరంతా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వారిని సురక్షితంగా వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. సంఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు.. స్వయంగా సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది.. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోయాయి. ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించారు.. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని చెబుతున్నారు.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరిగింది. శబరిమలై నుంచి శంషాబాద్‌కు తిరుగు ప్రయాణంలో సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మినీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ బస్సులో రంగారెడ్డి జిల్లాకు చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. డ్రైవర్ రాజు, మరో చిన్నారికి స్వల్పగాయాలయ్యాయి.. వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది.