తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశాలకు ముందు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో.. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ సర్పంచ్‌లు అరెస్ట్..అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పోలీసులు.. మాజీ సర్పంచ్‌లను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 531 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్‌లు. పాత బిల్లులు రాక రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌లు ముందుగానే పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వందలాది మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, తొలిరోజు శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్‌లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.కేసీఆర్.. వచ్చారు, వెళ్లారుకాగా, సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన .. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇక కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌కు అభివాదం చేశారు. అయితే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. ఇకపై జరిగే సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.