ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లి ఆంధ్రా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (131) బాదాడు. ఆ తర్వాతా గుజరాత్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత (77) ప్రదర్శన చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీవైపు దూసుకెళ్తున్న విరాట్‌ను ఔట్ చేశాడు. అతడు సంధించిన బంతిని ముందుకువచ్చి షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లి మిస్‌ చేశాడు. దీంతో ఆ బాల్‌ను అందుకున్న వికెట్‌ కీపర్‌ ఉర్విల్‌ పటేల్‌ విరాట్‌ను స్టంపౌట్‌ చేశాడు. విరాట్ కాకుండా రిషభ్ పంత్‌ను (70) కూడా సెంచరీ చేయనివ్వలేదు విశాల్ జైస్వాల్. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే తనను ఔట్ చేసిన జేస్వాల్‌కు కోహ్లి మర్చిపోలేని గిప్ట్ ఇచ్చాడు. మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లి కలిసేందుకు విశాల్ జేశ్వాల్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాడు. అతడి వైపు కంగారు పడుతూ వస్తున్న జేస్వాల్‌ను కోహ్లి చూసి.. దగ్గరికి పిలిచాడు. దీంతో జైస్వాల్ తన జేబులోంచి బాల్ తీసి.. దానిపై ఒక ఆటోగ్రాఫ్ చేయాలన్నాడు. వెంటనే కోహ్లి అతడిని పక్కన కూర్చోబెట్టుకుని కూల్ చేశాడు. ఈ సందర్భంగా 'నువ్ నిజంగా మంచి బౌలింగ్ చేస్తున్నావ్. అవకాశం వస్తుంది ఎదురుచూడు. కష్టపడు' అని చెప్పాడు. అనంతరం బంతిపై కోహ్లి సంతకం పెట్టాడు. విరాట్ కోహ్లితో దిగిన ఫొటోలను జేస్వాల్‌ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోహ్లి ఆటను టీవీలో చూసినప్పటి నుంచి అతడితో.. గ్రౌండ్ షేర్ చేసుకునే వరకు.. గ్రేట్‌‌ఫుల్‌ మూమెంట్స్‌ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. విరాట్‌ కోహ్లిని ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. ఇక తన అభిమానితో టైమ్ స్పెండ్ చేసి.. కోహ్లి, విశాల్ జైస్వాల్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని అని అంటున్నారు. కాగా, విరాట్ కోహ్లికి బౌలింగ్‌కు సంబంధించి తనకు ఎలాంటి స్పెషల్ ప్లాన్ లేదని జైస్వాల్ చెప్పాడు. "కోహ్లి ఒక దిగ్గజం. అతడికి బౌలింగ్ చేయడమే ఒక గొప్ప క్షణం. అతడు క్రీజులో ఉన్నప్పుడు నాపై విపరీతమైన ఒత్తిడి ఉంది. తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. ఒత్తిడిలో ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఫిట్‌నెస్ మొదలైన వాటిపై అతను నాకు చాలా చిట్కాలు చెప్పాడు. నిజానికి, కోహ్లిని ఔట్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ పేరు పక్కన అలాంటి వికెట్ (కోహ్లి పేరు) ఉండటం చాలా ప్రత్యేకమైన విషయమే కదా" అని జైస్వాల్ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో ప్రత్యేకంగా చెప్పాడు.