తిరుమలకు వచ్చే శ్రీవారి తీసుకుంది. వద్ద భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. అలిపిరి మెట్ల మార్గంలోని ఏడవ మైలు వద్ద అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో టీటీడీ దీనిని ఏర్పాటు చేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఆదివారం ఈ ప్రథమ చికిత్స కేంద్రం ప్రారంభమైంది. గుండా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురైతే.. ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో అపోలో వైద్యులు, టీటీడీ డాక్టర్లతో పాటుగా పారామెడికల్ బృందం అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ప్రథమ చికిత్స కేంద్రంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ , ఈసీజీ, నెబ్యులైజర్ వంటి సౌకర్యాలు, మందులను టీటీడీ అందుబాటులో ఉంచింది. నారా లోకేష్‌కు కాంగ్రెస్ ఎంపీ రిక్వెస్ట్.. టీటీడీ రియాక్షన్..మరోవైపు కాంగ్రెస్ నేత, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాకా వర్ధంతి నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే అలిపిరి మార్గంలో ఉన్న పరిస్థితులపై వంశీకృష్ణ వీడియో విడుదల చేశారు. మెట్లమార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయని.. దీంతో భక్తులకు అసౌకర్యం కలుగుతోందన్నారు. కమోడ్లు, స్టీల్ ట్రేల కారణంగా అక్కడక్కడా భక్తులు సరిగా నడవలేని పరిస్థితి ఉందన్నారు. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కడా ప్రథమ చికిత్స కేంద్రాలు లేవని.. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలపై వెంటనే స్పందించాలంటూ మంత్రి నారా లోకేష్‌ను కోరారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో టీటీడీ స్పందించినట్లు సమాచారం. అందులో భాగంగా అలిపిరి మెట్ల మార్గంలో ఏడో మైలు వద్ద ఈ ప్రథమ చికిత్స కేంద్రాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వేగంగా వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. ఇక ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో రెండు పడకలతో పాటుగా.. అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచారు.