షేర్ మార్కెట్లో కీలక పరిణామం.. మూతపడనున్న స్టాక్ ఎక్స్చేంజ్.. కారణమిదే?

Wait 5 sec.

Stock Exchange: దేశీయ స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి తెలిసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అయితే, దేశంలోనే అత్యంత పాతదైన స్టాక్ ఎక్స్చేంజ్ కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్. 117 ఏళ్ల చరిత్ర ఈ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ఉంది. అయితే, భారత దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మూతపడనుందట. ఈ ఎక్స్చేంజ్ బోర్స్ కార్యకలాపాలకు అక్టోబర్ 20వ తేదీ దీపావళి తర్వాత మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2013లోనే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ఆపేసింది. దీంతో అప్పటి నుంచి సీఎస్ఈ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెగ్యులేటరీ రూల్స్ పాటించకపోవడంతోనే ట్రేడింగ్ ఆపేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. గడిచిన దశాబ్ధకాలంలో కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడింగ్ పునరుద్ధరించేందుకు, సెబీ నిర్ణయాలను సవాలు చేసేందుకు ప్రయత్నాలూ జరిగాయి. అయితే అందులో ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో తాజాగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ పూర్తిగామూతపడతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు ఆ స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారులు తెలిపినట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి. మూసివేతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. దీపావళి తర్వాత అధికారికంగా ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. కీలక నిబంధనలు పాటించకపోవడంతోనే సీఎస్ఈ ట్రేడింగ్ నిలిపేయాలని సెబీ ఆదేశించింది. ఆ ఆదేశాలను కోర్టులో సవాలు చేసినా ఆర్థిక ఒత్తిడి, ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గిపోవడం వంటి అంశాలు మరింత బలహీనపరిచాయి. ఈ సమయంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పుంజుకున్నాయి. ఈ రెండు ప్రధాన బోర్స్‌లు ఆధిపత్యం చలాయించాయి. టెక్నాలజీ ఆధారిత మార్కెట్ మార్పులు చేస్తూ తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. వాటి పోటీని తట్టుకునే సామర్థ్యం సీఎస్ఈ వద్ద లేకపోవడంతో మరింత బలహీనపడాల్సి వచ్చింది. 2000 సంవత్సరం ప్రారంభంలో డాట్ కామ్ బూమ్ వచ్చిన సమయంలో సీఈఎస్ఈ టెక్నాలజీ ఆధారిత ఫైనాన్స్ సెక్టార్‌కి సరిపోయే మార్పులు సీఎస్ఈ చేసుకోలేకపోవడమూ ఒక కారణం. దీంతో ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాధాన్యం తగ్గిపోయింది. 2001లో కేతన్ పరేఖ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు సీఎస్ఈకి చివరి పెద్ద దెబ్బ తగిలింది. స్టాక్ బ్రోకర్ పరేఖ్ సీఎస్ఈలోని లొసుగుల ఆధారంగా కే-10 అనే స్టాక్స్ ధరలు కృత్రిమంగా పెంచాడు. దీంతో పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతిన్నది. రెగ్యులేటరీ మరింత కఠినమయ్యాయి. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ పని చేయకపోవడం మూసివేతకు దారితీసినట్లు తెలుస్తోంది.