వెండి ధర పెరగడంతో లాభాలు పొందారా? ట్యాక్స్ రూల్స్ ఇవే.. ఎంత పన్ను కట్టాలంటే

Wait 5 sec.

Silver Tax: బంగారాన్ని మించి వెండి ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది కాలంలో ఊహించిని రిటర్న్స్ అందించింది. అక్టోబర్ 21వ తేదీ దేశీయ మార్కెట్లో సిల్వర్ ధర కిలోకు రూ.1,82,000 వద్ద ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇది కిలో వెండి రేటు రూ.97000 స్థాయిలో ఉంది. అంటే అప్పటి నుంచి చూస్తే 70 శాతం మేర పెరిగింది. స్వచ్ఛమైన సిల్వర్ ధరలను అనుసరించే 10 సిల్వర్ ఈటీఎఫ్ పథకాలు చూసుకుంటే ఏడాదిలో 68 శాతం మేర లాభాలు అందించాయి. ఈ మేరకు అక్టోబర్ 20, 2025 రోజున వాల్యూ రీసెర్చ్ ఓ నివేదిక విడుదల చేసింది. అయితే, ఫిజికల్ సల్వర్ లేదా డిజిటల్ సిల్వర్ విక్రయించినప్పుడు వచ్చిన లాభాలపై మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అయితే, వెండి పెట్టుబడి రకం, ఎన్ని రోజులు అనే విషయాలను బట్టి ఈ ట్యాక్స్ అనేది మారుతుంటుంది. ఈ క్రమంలో ఫిజికల్ వెండి, సిల్వర్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటికి ఏ విధంగా ట్యాక్స్ విధిస్తారు అనేది తెలుసుకుందాం. చాలా మంది ఫిజికల్ సిల్వర్ (వెండి నాణేలు, వెండి ఆభరణాలు) కొనుగోలు చేస్తుంటారు. దీనిని జువెలరీలు, బ్యాంకులు, ఎక్స్చేంజీల నుంచి కొనుగోలు చేయవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ అనేది 99.9 ప్యూర్ సిల్వర్ ధరలను అనుసరిస్తుంది. వెండి ధర పెరిగినప్పుు ఈటీఎఫ్ నెట్ అసెట్ వాల్యూ సైతం పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలువస్తాయి. ఇక డిజిటల్ సిల్వర్ అంటే నేరుగా బంగారం కొనకుండా వెండి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం. అయితే, వీటి ధరలు నిజమైన వెండి ధరలకు సమానంగానే ఉంటాయి. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొవైడర్ల నుంచి డిజిటల్ రూపంలో సిల్వర్ కొనుగోలు చేయడం, విక్రయించడం చేయవచ్చు. ఎంత ట్యాక్స్ పడుతుంది?వెండి నాణేలు, నగలు కొనుగోలు చేసి 24 నెలల లోపు విక్రయిస్తే వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG)గా పరిగణిస్తారు. శ్లాబ్ రేట్ల ప్రకారం ట్యాక్స్ పడుతుంది. అదే 24 నెలల తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. 2024, జూలై 23వ తేదీ తర్వాత కొనుగోలు చేసిన వెండి అయితే, ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5 శాతం పన్ను పడుతుంది. అదే ఇండెక్సేషన్ బెనిఫిట్ తో పాటు అయితే 20 శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇక సిల్వర్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వెండి పెట్టుబడులకు సైతం ఇదే రేటు వర్తిస్తుంది. మరోవైపు.. వస్తు సేవల పన్ను జీఎస్టీ విషయానికి వస్తే వెండి జువెలరీ, కడ్డీలు, కాయిన్స్ వంటి వాటికి అయితే 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. తయారీ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.