పండుగ వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి తన ఆవేదన బయటపెట్టారు. గత కొంత కాలంగా తాను మానసికంగా బాధపడుతున్నట్లు చెప్పారు. దానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు అడ్లూరి లక్ష్మన్, శ్రీధర్ బాబు అని ఆరోపించారు. అంతేకాకుండా తనను ఓ మేకలా బలిచ్చారని.. అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.బలిపశువును చేశారు..మీడియా సమావేశంలో తన మనసులోని ఆవేదనంతా జీవన్ రెడ్డి బయటపెట్టారు. తాను మానసిక హింసకు గురికావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ కారణం ఆరోపించారు. వారిద్దరి కారణంగా రోజూ ఎంతో క్షోభను అనుభవిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తనను ఒక మేకలా.. బలి పశువును చేశారని సంచలన ఆరోణపలు చేశారు. అయితే తనకు ఎలాంటి పదవులు వద్దని.. ఇకపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అని వెల్లడించారు.కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదు..బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (డాక్టర్ సంజయ్) ఉద్దేశించి.. పార్టీ ఫిరాయించి వచ్చినవాళ్లకు ప్రాధాన్యత ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ.. డాక్టర్ సంజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో తనకు అర్థం కావడం లేదని ఘాటుగా విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి చెబితేనే పలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ చేరిన సమయంలోనూ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఒక సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అనే దాక వెళ్లారు. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న తనతో.. ఆ విషయం గురించి అధిష్ఠానం కనీసం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది అంటూ వాపోయారు. దీంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు అని శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజలు, కార్యకర్తల పక్షాన నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడు ఆ మంత్రిపైనే జీవన్ రెడ్డి ఆరోపణలు చేయడం గమనార్హం.