విమానం నడిపిన బీజేపీ ఎంపీ.. మధ్యలో కేంద్ర మంత్రితో కబుర్లు.. జర్నీ సాగిపోయిందలా..

Wait 5 sec.

సమావేశాలు, ర్యాలీలు, పర్యటనలంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు రాజకీయ నాయుకులు. అందులో ఏ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగానో పదవులు ఉంటే.. ఇంకా తీరిక లేకుండా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంతమంది నేతలు తమ అభిరుచులకు కూడా కొంత సమయం కేటాయిస్తారు. తాజాగా బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ విమానం కో-పైలట్‌‌గా విమానం నడిపారు. అదే విమానంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఉన్నారు. ఈ క్రమంలో నేతలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ చేశారు శివరాజ్ సింగ్. ఇది మర్చిపోలేని అనుభూతి అంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు..నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ఇదీ జరిగింది..బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో సివారాజ్ సింగ్ చౌహాన్‌ ప్రయాణించారు. ఈ క్రమంలో విమానంలో ఆ విమానానికి కో-పైలట్‌గా ఉన్న ప్రతాప్ రూడీని చూసి చౌహాన్ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం నేతలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. "రాజీవ్‌.. ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. ఈ ప్రయాణం నాకు మర్చిపోలేనిది. ఎందుకంటే ఈ విమానానికి నా మిత్రుడు, ఛప్రా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కో-పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు" అని చౌహాన్ పోస్టులో రాశారు. ఇక విమానం వెళ్తున్నప్పుడు.. అందమైన మార్గాన్ని కూడా అద్భుతంగా రూడీ వివరించారని చౌహాన్ తెలిపారు. అంతేకాకుండా, ఎంపీ ప్రతాప్ రూడీని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి.. ఓ లేఖను కూడా రాశారు. అందులో రూడీపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యక్తులు చాలా రేర్ అని అన్నారు. బిజీ షెడ్యూల్‌లు ఉన్నప్పటికీ.. తమ ట్యాలెంట్ కోసం సమయం కేటాయిస్తారని చెప్పారు. సందర్భంగా తన ప్రయాణాన్ని మరచిపోలేని విధంగా మార్చినందుకు రూడీకి.. కృతజ్ఞతలు చెప్పారు.బిహార్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూడీ.. లైసెన్స్‌డ్ కమర్షియల్ పైలట్. ఆయన పైలట్ లైసెన్స్ మెయింటేన్.. చేయడానికి అప్పడప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు నడుపుతుంటారు. ఎయిర్‌బస్ ఏ320 నడపగల ఏకైక పార్లమెంటేరియన్‌గా రూడీ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాందించారు. 2003 నుంచి 2004 వరకు విమానయాన శాఖ మంత్రిగానూ ఆయన పనిచేశారు. 2025లో బిహార్‌లో అగ్రవర్ణ కులాల్లో ఐక్యత పెంచడానికి సంగ యాత్ర అని ప్రారంభించారు. ఇక అప్పుడప్పుడూ అలా విమానాల్లో పైలట్‌గా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రతాప్ రూడీ.