బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఎగిరి గంతేసే శుభవార్త.. 5Gపై కేంద్ర మంత్రి ప్రకటన.. మరో 6 నెలల్లోనే..!

Wait 5 sec.

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం (బీఎస్ఎన్ఎల్‌)కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఇప్పటికీ 5జీ సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కి మారాలనుకునే వారు వెనకడుకు వేస్తున్నారు. కొందరు అరకొర సిగ్నల్‌తో ఇబ్బందులు పడుతూ కొనసాగుతున్నారు. వారందరు ఎగిరి గంతేసే శుభవార్త వచ్చేసింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి బిగ్ అప్డేట్ ఇచ్చారు. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4జీ నెట్‌వర్క్‌ను అతి త్వరలో 5జీ సేవలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ప్రకటించారు. ఈ ప్రక్రియ రాబోయే 6 నుంచి 8 నెలల్లో పూర్తి కావచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కంపెనీలు హువావే, శామ్ సంగ్, నోకియా, జడ్‌టీఈ, ఎరిక్సన్ మాత్రమే 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం చేయాలయిస్తున్నాయని, అయితే, ఇప్పుడు ఆ లిస్టులోకి భారత్ సైతం చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కౌటిల్య ఎకనామిక్ ఎంక్లేవ్ 2025 కార్యక్రమానికి హాజరైన క్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. భారత ఆవిష్కరణల సామర్థ్యానికి, వినూత్నతకు ఇది అద్దం పడుతోందన్నారు. త్వరలోనే 4జీ టవర్లను 5జీ నెట్‌వర్క్ టవర్లుగా మారుస్తామని వివరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో బీఎస్ఎన్ఎల్ యూజర్లలో జోష్ నిండిందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కి మారుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఇంకా 4జీనే సరిగా అందుబాటులోకి రాకపోవడంతో కొందరు నిరుత్సాహ పడుతున్నారు. దేశంలోని ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇప్పటికే తమ యూజర్లకు 5జీ సేవలు అందిస్తున్నాయి. 5జీ నెట్ వర్క్ ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ ఆకర్షిస్తున్నాయి. అయితే, కొద్ది నెలల క్రితం రిఛార్జ్ ధరలను భారీగా పెంచడం, అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ తక్కువ ధర ప్లాన్లు అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ టెలికాం సంస్థ నెట్‌వర్క్‌కి చాలా మంది మారారు. 5జీ అందుబాటులోకి వస్తే మరింత మంది మారతారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తక్కువ ధరల రీఛార్జ్ ప్లాన్ల ద్వారా ఇతర నెట్‌వర్క్ యూజర్లను బీఎస్ఎన్ఎల్ ఆకర్షిస్తోంది. ఇక 5జీ సేవలు అందుబాటులోకి వస్తే మరింత మంది యూజర్లు ఆకర్షితులవుతారని చెప్పవచ్చు