పాకిస్థాన్‌పై భారత్ జైత్రయాత్ర.. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌..!

Wait 5 sec.

2025లో భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. దాయాది దేశంపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 247 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్‌ను 159 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించి.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది.రిచా ఘోష్ మెరుపులు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 240కి పైగా స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం రిచా ఘోష్. పాకిస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్.. తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో రిచా ఘోష్.. 20 బంతుల్లో 35 రన్స్ చేసి.. టీమిండియా మెరుగైన స్కోరు సాధించేలా చేసింది. హర్లీన్ డియోల్ (46) టాప్ స్కోరర్‌. భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. పాక్ మహిళా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా వన్ డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ (106 బంతుల్లో 81 రన్స్‌) మాత్రం పోరాటం చేసింది. కానీ ఆమె పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించిందే తప్ప ఒటమిని కాదు. భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్.. 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 3, స్నేహ్ రాణా 2 వికెట్లు తీశారు.పాయింట్స్ టేబుల్‌లో టాప్..ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది. ఇక పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో తాజాగా భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో ఉంది. కాగా ఈ విజయంతో వరుసగా నాలుగు ఆదివారాల్లో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఇందులో మూడు విజయాలు పురుషుల ఆసియాకప్ 2025లో వచ్చాయి.