వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే లైసెన్స్ రద్దు, బండి సీజ్!

Wait 5 sec.

వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన, కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది. భారీ మూల్యం చెల్లించక తప్పదు. సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో మార్పులు చేస్తూ కేంద్ర రవాణా శాఖ ఈ డ్రాఫ్ట్ రూల్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ సవరణలు దోహదపడతాయని అధికారులు వెల్లడించారు. కీలకమైన కొత్త నిబంధనలు, గడువులుప్రస్తుతం చలాన్ కట్టడానికి 90 రోజుల గడువు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం, చలాన్ జారీ అయిన తేదీ నుంచి కేవలం 45 రోజుల్లోగా తప్పనిసరిగా చెల్లించాలి. ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ (5+) చలాన్లు జారీ అయితే సంబంధిత అథారిటీ ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసే అధికారం ఉంటుంది. ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా కొనసాగుతాయి.45 రోజుల్లోగా చలాన్ చెల్లించడంలో ఆలస్యం జరిగితే, ఆ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.చలాన్ కట్టకపోతే, ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.గడువులోగా చలాన్ చెల్లించకపోతే, ఆ వాహనంపై రవాణా శాఖ (RTA) ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. దీనివల్ల వాహనాన్ని ఎవరికీ విక్రయించలేరు.లైసెన్స్‌లో చిరునామా, పేరు మార్పు వంటి సేవలు, రిజిస్ట్రేషన్ రెన్యువల్‌ కూడా కుదరదు.ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. చలాన్ జారీ అయిన సమయంలో వాహన యజమాని కాకుండా వేరే వ్యక్తి నడుపుతున్నట్లు నిరూపిస్తే, ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తినే బాధ్యుడిని చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన తరువాత, అధికారులు వాహనదారులకు నోటీసులు జారీ చేయడంలో కచ్చితమైన గడువు పాటించాలి. ఉల్లంఘన జరిగిన 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలి. 15 రోజుల్లోగా ఫిజికల్ రూపంలో (పోస్టు ద్వారా) నోటీసు పంపాలి. తమ తప్పేమీ లేదని భావిస్తే, వాహనదారులు 45 రోజుల్లోగా చలాన్‌పై అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, వాటాదారులు ఎవరికైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే తెలియజేయవచ్చు. దిల్లీలోని రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి, ఈ-మెయిల్ comments-morth@gov.in కు తమ సూచనలను పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుముఖం పడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. వాహనదారులు తప్పనిసరిగా ఈ కొత్త నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం మరియు వాటిని పాటించడం అవసరం.