EPFO: ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఈపీఎఫ్ సేవలు మరింత సులభంగా పొందేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పలు సంస్కరణలు చేసింది. ఈ కొత్త మార్పులను ఇప్పటికే అమలులోకి తెచ్చింది. ప్రత్యేక క్లెయిమ్ సహా పలు సేవలకు ఇప్పటి వరకు ప్రాంతీయ కమిషనర్ ఆమోదం పొందాల్సి ఉండేది. కానీ, ఇక నుంచి అకౌంట్స్ ఆఫీసర్ లేదా సహాయ పీఎఫ్ కమిషనర్ మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. పూర్వ ఈపీఎస్ సర్వీసును ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని సర్వీసుతో కలపడం, పీఎఫ్ అడ్వాన్స్ పేమెంట్లు, వడ్డీ లెక్కింల్లో లోపాలు, అదనపు చెల్లింపుల వంటి ఈపీఎస్ తదితర 15 రకాల పనులు, సేవలు ఇక మరింత వేగంగా అందనున్నాయి. ఆయా సేవలు, పనులు ఇకపై అకౌంట్స్ అధికారి స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు రీజనల్ పీఎఫ్ కమిషనర్లకు కేంద్ర అడిషనల్ పీఎఫ్ కమిషనర్ సుచింద్రనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడే పింఛను సర్వీసు పెరగడంతో పాటుగా నిల్వలన్నీ ఒకే చోట ఉంటాయి. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అనుబంధం- కే జారీ చేస్తారు. ఇందులో పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ, పూర్తి సర్వీసు, ఉద్యోగి వివరాలు ఉంటాయి. కొత్త కంపెనీకి మారినప్పుడు ఉద్యోగి మెంబర్ పోర్టల్‌లో బదిలీ క్లెయిమ్ ఫారం 13 ఇవ్వాలి. కొత్త కంపెనీ మొదటి చందా జమ చేసే నాటికి ఆటోమేటిక్‌గా గత సర్వీసు, నిల్వలు బదిలీ చేస్తారు. ఆ తర్వాత పీఎఫ్ ట్రస్టు లేదా ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీస్ కే డాక్యుమెంట్ జారీ చేస్తుంది. అయితే ఇకపై ఈ కే పత్రం ఆన్‌లైన్ లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది. మెంబర్ పోర్టల్‌లో ఆన్‌లైన్ సర్వీసులోకి వెళ్లి క్లెయిమ్ ట్రాకింగ్‌లో కే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు.. తుది క్లెయిమ్‌లో పార్ట్ పేమెంట్లు చేయడానికి ఈపీఎఫ్ఓ అనుమతి ఇచ్చింది. పూర్తి చందా రాలేదనే కారణంతో తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. ఒక కంపెనీ ఉద్యోగి ఐదేళ్ల సర్వీసు ఉంటే మూడేళ్ల సర్వీసు పీఎఫ్ చందాలనే చెల్లించింది అనుకుందాం. ఈ లోపు ఆ ఉద్యోగి మరో కంపెనీలోకి మారితే ఐదేళ్ల సర్వీసుకు పూర్తి చందా రాలేదనే కారణంతో క్లెయిమ్ తరిస్కరిస్తున్నారు. ఇక నుంచి అలా ఉండదు. ఈపీఎఫ్ చట్టంలోని పేరా 10.11 పార్ట్ 2ఏ ప్రకారం తుది క్లెయిమ్‌లో పార్ట్ పేమెంట్లు చేయనున్నారు. అలాగే మిగతా బకాయి చందాలను వసూలు చేసి ఆ మొత్తాన్ని ఫైనల్ పేమెంట్ కిందకు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.