టీమిండియా నూతన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన .. ఆస్ట్రేలియా ఏతో జరిగిన వన్డే సిరీస్‌కు సారథిగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే సిరీస్‌ను టీమిండియా 2 - 1 తేడాతో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ను కూడా సునాయాసంగా ఛేదించింది. శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించగా, తన సత్తా చాటాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు విఫలమైనప్పటికీ కూపర్ కాన్లీ మ్యాచ్‌ని నిలబెట్టాడు. లియామ్ స్కాట్, కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. కూపర్ కాన్లీ 64, లియామ్ స్కాట్ 73, జాక్ ఎడ్వర్డ్స్ 89 పరుగులు చేయగా.. ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో 49.1 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా నుంచి మొత్తం ఎనిమిది మంది బౌలర్లు బౌలింగ్ వేయడం విశేషం. అర్షదీప్ సింగ్ పది ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీయగా, హర్షిత్ రాణి 9.1 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆయుష్ బదోనీ రెండు తీయగా.. గుర్‌జపనీత్ సింగ్, నిషాంత్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ ఏ జట్టు ఇచ్చిన 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏకు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శుభారంభం అందించాడు. అభిషేక్ శర్మ కేవలం 22 పరుగులే చేసి అవుటవ్వగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 68 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 62, 62 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. ఆఖర్లో విప్‌రాజ్ నిగమ్ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. కాన్పూర్ వేదికగా సాగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మొదటి మ్యాచ్‌లో విజయం సాధించగా, ఆసీస్ రెండో వన్డేలో గెలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బ్యాటర్లు రాణించడంతో సిరీస్ సొంతం చేసుకున్నారు. మూడు వన్డేల్లోనూ రాణించిన రియాన్ పరాగ్‌ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకోగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.