రూ.6 నుంచి రూ.430కి షేరు ధర.. 5 ఏళ్లకే లక్షకు రూ.65 లక్షలొచ్చాయ్..!

Wait 5 sec.

Penny Stock: ఇన్వెస్టర్లు తమ డబ్బులను దీర్ఘకాలంలో పలు రెట్లు పెంచే స్టాక్స్ గురించి వెతుకుతుంటారు. కొందరు సరైన స్టాక్స్ ఎంచుకుని తమ సంపద సృష్టి లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటి స్టాక్స్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భాల్లోనూ రాణిస్తుంటాయి. కొన్నిసార్లు నష్టాల్లోకి జారుకున్నా చాలా వేగంగా పుంజుకుంటాయి. దీంతో మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలుస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో ఒకటే ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (). మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ 2021, మార్చి నుంచి బలమైన పనితీరు కనబరుస్తోంది. అప్పటి నుంచి పరుగులు పెడుతూనే ఉంది. మధ్య మధ్యలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్‌కు దిగినా అలాంటి వాటి నుంచి వేగంగా కోలుకుంది. దీంతో రికార్డ్ గరిష్ఠాలను నమోదు చేస్తూ వచ్చింది. ఈ కంపెనీ షేర్లు, సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సహా రుణాలు, అడ్వాన్సులు ఇవ్వడం వంటి ఫండ్ ఆధారిత సేవలు అందిస్తోంది. ఈ సంస్థ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ అసెట్స్, డెబ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెడుతుంది. 2021, మార్చిలో ఈ షేరు ధర రూ.6.60 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.430 స్థాయికి ఎగబాకింది. అంటే ఐదేళ్ల కాలంలోనే ఈ స్టాక్ 6400 శాతం పెరిగింది. ఈ స్టాక్ ఈ 2026లో సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.683.50ని తాకి ప్రస్తుతం రూ.430 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే, ఈ స్టాక్ జర్నీ మొత్తం సజావుగా ఏమీ సాగలేదు. 2025 సెప్టెంబర్ నుంచి గత ఫిబ్రవరి 2026 మధ్య ఈ స్టాక్ భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. తమ విలువలో 25 శాతం మేర పడిపోయింది. అయితే, ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గత 5 ఏళ్లుగా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. రూ.1 లక్ష పెడితే రూ.65 లక్షలు రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ షేర్ల విలువ దాదాపురూ.65 లక్షలుగా ఉంటుంది. ఈ కంపెనీ 2021, అక్టోబర్ నెలలో స్టాక్ స్ప్లిట్ 1:10 రేషియోలో చేసింది. ఆ తర్వాత 2024, జనవరిలో 4:1 రేషియోలో బోనస్ షేర్లు అందించింది. వీటిని సైతం కలుపుకొంటే ఇన్వెస్టర్ల లాభాలు భారీగా పెరుగుతాయి.