వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. 3 రోజుల్లో రూ. 7850 డౌన్.. మార్చి 4న జువెల్లరీల్లో రేట్లు ఇవే..!

Wait 5 sec.

March 4 Tanishq Gold Rate: ఒకవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. పలు దేశాలు పరస్పరం బాంబులు విసురుకుంటున్నా.. బంగారం ధర పతనం అవుతోంది. సాధారణంగా ప్రతికూల పరిస్థితుల్లో.. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు భారీగా పెరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి పెట్టుబడులు పెరగడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టడం, ఇరాన్ ప్రతిదాడులు చేయడం, గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడుతుండటంతో 3 రోజుల కింద భారీ స్థాయిలో ఎగబాకాయి. అయితే పరిస్థితి వెంటనే మారిపోయింది. యుద్ధప్రభావం ఏమాత్రం తగ్గకున్నా బంగారం, వెండి ధరలు 3 రోజులుగా పతనం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మార్చి 4న మధ్యాహ్నం 3 గంటల సమయంలో చూస్తే దేశీయంగా బంగారం ధర మళ్లీ భారీగా దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 2850 తగ్గడంతో తులం రూ. 1,50,800 కు చేరింది. దానికి ముందు రూ. 2,350 తగ్గుముఖం పట్టింది. ఇలా 3 రోజుల్లోనే ధర రికార్డు స్థాయిలో రూ. 7,850 తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల పసిడి ధర ఇంతకంటే ఎక్కువ పతనమైంది. వెండి ధర మరో రూ. 20 వేలు తగ్గి ప్రస్తుతం కేజీకి రూ. 2.95 లక్షల వద్ద ఉంది. ఇక జువెల్లరీల్లో రేట్లు చూస్తే లలితా జువెల్లరీలో గ్రాము పసిడి ధర మార్చి 4న మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే రూ. 15,080 వద్ద ఉంది. ముందటి రోజు లేదా మార్చి 4న ఉదయం 7 గంటలకు ఇది రూ. 15,365 వద్ద ఉండేది. ఈ క్రమంలో గ్రాముపైనే రూ. 285 తగ్గింది. టాట్ ప్రొడక్ట్ తనిష్క్ జువెల్లరీలో చూస్తే గ్రాము పసిడి ధర ప్రస్తుతం రూ. 15,120 వద్ద ఉంది. కిందటి రోజు రూ. 15,405 వద్ద ఉండేది. ఖజానా, కల్యాణ్ జువెల్లర్స్, జోయాలుక్కాస్‌లో పసిడి ధర గ్రాముకు రూ. 15,080 వద్దే ఉంది. ఈ బంగారు ఆభరణాల ధర షాపుల్ని బట్టి.. ప్రాంతాల్ని బట్టి మారుతుంటుంది. ఎన్నో అంశాలు ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇంకా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసేటప్పుడు అదనంగా మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వర్తిస్తాయి. మేకింగ్ ఛార్జీలు డిజైన్‌ను బట్టి.. షాపును బట్టి మారుతుంటాయి. జీఎస్టీ మాత్రం మొత్తం బిల్లుపై 3 శాతం పడుతుంది. మేకింగ్ ఛార్జీలపైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్‌లో (IBJA) చూస్తే బంగారం ధర ఇంకా తక్కువగా ఉంది. ఇక్కడ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,771 గా ఉంది.బంగారం ధరల పతనానికి కారణాలివే..ఒకవైపు యుద్ధ భయాలు నెలకొన్నా బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణం యూఎస్ డాలర్. అవును ఇటీవల వరుసగా తగ్గిన డాలర్.. ఇప్పుడు క్రమంగా పుంజుకొని నెల గరిష్ఠానికి చేరింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ రూపేణా బంగారం కొనుగోలు మరింత భారంగా మారుతుంది. ఇప్పుడు యుద్ధం.. ద్రవ్యోల్బణం భయాల్ని పెంచగా.. ఇప్పట్లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే బంగారం ధర ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంటుంది.