పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే, ఈ ప్రూఫ్ తప్పనిసరి

Wait 5 sec.

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానుండటంతో.. ఈ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ మేరకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు మొత్తం 3,415 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థుల్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి వెళ్లేందుకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు టెన్త్‌ హాల్‌ టికెట్‌ చూస్తే చాలని తెలిపారు. నేడు పది హాల్‌టికెట్లురాష్ట్రంలో రాయబోతున్న విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానుండగా.. విద్యార్థులకు హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాల్‌టికెట్లను విడుదల చేయనున్నారు. ఈ మేరకు 'ప్రభుత్వం బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.inతో పాటుగా మనమిత్ర వాట్సప్‌ నంబరు (9552300009), పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్‌ యాప్‌లో నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు' అని అధికారులు తెలిపారు. కేజీబీవీలో ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌లో కేజీబీవీ (కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో) ప్రవేశాలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 12 నుంచి కేజీబీవీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. 'రాష్ట్రవ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాము. ఆరో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్ అడ్మిషన్లకు, 7 నుంచి పదో తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 1 వరకు దరఖాస్తులు తీసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్‌ 13న విడుదల చేసి, 13 నుంచి 17 వరకు ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించాలి' అని సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.