విజయ్‌ దేవరకొండ - రష్మిక ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో గ్రాండ్‌గా విరోష్ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్‌ అనగానే విజయ్‌ - రష్మిక సూటూ బూటూ వేసుకొని, మోడరన్ కాస్ట్యూమ్స్ లో చాలా గ్రాండియర్ లుక్ లో దర్శనమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ విరోష్ జోడీ పూర్తి భిన్నంగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ లో సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. విజయ్ పంచె కట్టుకొని, భుజంపై కండువా వేసుకొని సరికొత్త గెటప్ లో కనిపించగా.. రష్మిక రెడ్ శారీలో ఆకట్టుకుంది. ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని వేదికపై ఎంట్రీ ఇచ్చారు. ముందుగా అతిథులను పలకరించి, ఆ తర్వాత వేడుకలో పాల్గొన్నారు. ఇదే సెలబ్రేషన్స్ కి లాస్ట్ డే అని, ఇక అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతామని విరోష్ జోడీ తెలిపారు.విజయ్‌ - రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ లో మెగా ఫ్యామిలీ నుంచి , రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు హాజరయ్యారు. - అమల దంపతులతో పాటుగా నాగ చైతన్య కూడా వచ్చారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌, ఆమె కుమార్తె సితార ఈ వేడుకలో పాల్గొన్నారు. , నవీన్‌ పొలిశెట్టి, నిర్మాత నాగవంశీ, తమిళ హీరో కార్తీ, నాని దంపతులు, సుకుమార్‌ ఫ్యామిలీ, నిర్మాత దిల్‌ రాజు కుటుంబం, రాధిక- శరత్‌కుమార్‌ దంపతులు తదితరులు విరోష్ రిసెప్షన్‌ లో సందడి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సతీమణి గీత, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ లో పాల్గొని, విజయ్‌ - రష్మిక జంటను ఆశీర్వదించారు.