పాకిస్తాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో పాల్గొనే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడాన్ని గవాస్కర్ తీవ్రంగా విమర్శించారు.సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉన్న , అబ్రార్ అహ్మద్‌ను భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆటగాడిని తీసుకోవడంపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు.ఈ నేపథ్యంలో గవాస్కర్ తన కాలమ్‌లో స్పందిస్తూ భారత-పాకిస్తాన్ సంబంధాల చరిత్రను గుర్తు చేశాడు. ఆయన ప్రకారం, 2008 ముంబై అటాక్స్ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తొలగించారు. అదేవిధంగా 2019 పహల్గాం అటాక్ కూడా భారత క్రికెట్ సంస్థలు పాకిస్తాన్‌తో దూరంగా ఉండటానికి మరో ముఖ్య కారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.గవాస్కర్ వ్యాఖ్యల ప్రకారం, పాకిస్తాన్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు వారి ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది. ఆ డబ్బు ద్వారా ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశముందని అది పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణనష్టానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. “ఒక భారతీయ యజమాని ఉన్న ఫ్రాంచైజీ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై వచ్చిన ఆగ్రహం ఆశ్చర్యం కాదు” అని గవాస్కర్ పేర్కొన్నాడు.అంతేకాకుండా ఇటీవల మరో ఘటనను కూడా ఆయన గుర్తు చేశాడు. బీసీసీఐ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని సూచించిన విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఇక అబ్రార్ అహ్మద్ కొనుగోలు తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతాను కొంతసేపు డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది. విమర్శలు తగ్గిన తర్వాత ఆ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది.ఇదే సమయంలో జట్టు కోచ్ డానియల్ వెటోరీ మరో పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను కూడా జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడం మరింత వివాదానికి దారితీసింది. వెటోరి న్యూజిలాండ్‌కు చెందినవాడని, భారత-పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని గవాస్కర్ అన్నారు. అయితే భారతీయ యజమానులు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుని అలాంటి నిర్ణయాలను నివారించాల్సిన బాధ్యత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.“ఇది భారతీయ సంస్థ అయినా, విదేశీ అనుబంధ సంస్థ అయినా యజమాని భారతీయుడే. అయితే ఆ డబ్బు పరోక్షంగా భారతీయుల ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?” అని గవాస్కర్ ప్రశ్నించారు.