స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ‘బీబీ జోడీ సీజన్ 2’ (BB Jodi Season 2) తుది సమరానికి చేరుకుంది. 12 జోడీల మధ్య రసవత్తరంగా సాగిన ఈ డాన్స్‌ సెమీ ఫైనల్‌కి చేరుకునేసరికి ఆరు జంటలు మాత్రమే మిగిలారు. 2025 డిసెంబర్ 27న ఆర్భాటంగా ఆరంభమైన ‘బీబీ జోడీ సీజన్ 2’ మరో రెండు వారాల్లో ముగియనుంది. అయితే ఇప్పటికే విన్నర్ ఎవరనే విషయంపై బీబీ జోడీ ఫాలోవర్స్‌కి క్లారిటీ వచ్చేసే ఉంటుంది. షో ఆరంభం నుంచి ఫినాలే వరకూ తమ డాన్స్ పెర్ఫామెన్స్‌తో స్టేజ్‌ని షేక్ చేస్తున్న శ్రేష్టి వర్మ, మానస్‌లు బీబీ జోడీ సీజన్ 2 విజేతలు కాబోతున్నారు. ఇక వీరికి గట్టి పోటీ ఇచ్చిన విశ్వ, నేహా చౌదరిలు రన్నరప్‌గా నిలవబోతున్నారు. రెండో సీజన్‌కి వచ్చేసరికి ఎవరెవరు జోడీలుగా ఉన్నారంటే..ధనరాజ్-భానుశ్రీవిశ్వ - నేహా చౌదరిమణికంఠ- ప్రియాంక సింగ్అమర్ దీప్- నైనికమానస్- శ్రేష్టి వర్మఅర్జున్ కళ్యాణ్- శ్రీ సత్యసాయి శ్రీనివాస్ - కిర్రాక్ సీతరీతూ చౌదరి - డెమాన్ పవన్ఆర్జే చైతూ - శ్రీజా దమ్ముబీబీ జోడీ సీజన్ 2లో తుది సమరంలో ఆరు జోడీలు మాత్రమే మిగిలాయి. అంతకుముందు పటాకా-ధమాకా అనే గ్రూపులు ఉండేవి. గ్రాండ్ ఫినాలేకి వచ్చేసరికి ఈ రెండు గ్రూప్‌లను తీసేసి.. మజాకా అంటూ ఆరు గ్రూప్‌లతో టైటిల్ వార్ రసవత్తరంగా మార్చేశారు. అయితే ఈ టైటిల్ వార్‌లో తొలి నుంచి కూడా హవా కొనసాగించిన మానస్, శ్రేష్టి వర్మలు అదే ఊపుని ఫినాలే వరకూ కొనసాగించి బీబీ జోడీ సీజన్ 2 టైటిల్‌ని సొంతం చేసుకోబోతున్నారు. మూడేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ.. బీబీ జోడీ మూడేళ్ల క్రితం ప్రారంభం కాగా.. ఫస్ట్ సీజన్‌లో ఆర్జే సూర్య, ఫైమాలు‌లు విజేతలుగా నిలిచారు. అరియానా, అవినాష్‌లు రన్నరప్‌గా నిలిచారు. ఆ సీజన్‌లో విన్నర్స్ అవుతారనుకున్న వాసంతి కృష్ణణ్, అర్జున్ కళ్యాణ్‌లు మూడో స్థానంలో నిలిచారు. ఫస్ట్ సీజన్‌కి శ్రీముఖి హోస్ట్ చేయగా.. రాధ, తరుణ్ మాస్టర్‌, సదా జడ్జీలుగా వ్యవహరించారు. ఇక రెండో సీజన్‌కి యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేయగా.. శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్ కుమార్‌లు జడ్జీలుగా వ్యవహరించారు. గత మూడేళ్లుగా బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందు నీతోనే డాన్స్ ఉండేది. కానీ ఈసారి బీబీ జోడీ సీజన్ 2ని నిర్వహించారు. దాంతో పాటు మ్యాడ్ ఫర్ ఈజ్ అదర్ కూడా ప్రసారం అవుతుంది. ఆ షో కంప్లీట్ కాగానే.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.