మెుయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు

Wait 5 sec.

రంగారెడ్డి జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా మెుత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ సహా మరో నలుగురికి డ్రగ్స్ పాటిజివ్‌గా తేలింది. ప్రస్తుతం మహేష్ బెయిల్‌పై బయట ఉండగా.. ఫాంహౌస్‌లో కాల్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కాగా, ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ మాదకద్రవ్యాలను ప్రోత్సహిస్తోందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించిందని. ఈ పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలనిఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ వెల్లడించారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం, నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. డీసీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..ఈ కేసులో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం ఇవాళ్టి నుంచే రంగంలోకి దిగి డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు..? అక్కడ డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది..? దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారణ చేపట్టనుంది. ఈ డ్రగ్స్ దందాతో దుబాయ్‌కు ఉన్న సంబంధాలపై కూడా సిట్ ఆరా తీయనుంది. దాంతో పాటు ఫైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీలోకి తీసుకొని విచారించాలని సిట్ భావిస్తోంది.