రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి రంగనాథ్.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్

Wait 5 sec.

ఉన్నాయి. చేసిన ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో అదే కూల్చివేతలతో నష్టపోయిన వారు మాత్రం.. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, స్థలాలు ఆక్రమణలకు గురైతే.. వాటిని గుర్తించి కూల్చేయడమే ఈ కర్తవ్యం. ఈ హైడ్రాకు కీలక అధికారాలు కట్టబెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే .. ఒక ఐపీఎస్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినట్లు చేస్తున్నారని చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఐపీఎస్‌గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఆయన స్పందిస్తూ.. ఒక క్లారిటీ ఇచ్చారు. తాను పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రంగనాథ్‌ స్పష్టం చేశారు. తనకు ఇంకా 5 ఏళ్ల సర్వీస్ ఉందని తెలిపారు. మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి వెళ్తాను అని అనడం సరికాదని పేర్కొన్నారు. కాపు సంఘం మీటింగ్‌లకు వెళ్లి మంచి విషయాలు చెబుతామని.. మన దేశంలో కులం అనేది ఉందని వెల్లడించారు. అయితే.. కులపిచ్చి ఉండొద్దని చెబుతున్నామని.. తన కులం వ్యక్తి అని ఫేవర్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. తమ కులం వ్యక్తి తప్పు చేసి.. పక్క కులం వ్యక్తి సరైనది చేసినా.. ఏది ఒప్పో అదే ఒప్పు అని తేల్చి చెప్పారు. తనకు 10, 15 ఏళ్ల నుంచి మెగా కుటుంబంతో పరిచయం ఉందని.. హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కలిసినట్లు ఏవీ రంగనాథ్ తెలిపారు. తాను చాలా మంది సినిమా స్టార్లను, క్రికెటర్లను, షటిల్ ప్లేయర్లు, సింగర్లను ఎందరినో కలుస్తుంటానని పేర్కొన్నారు. తాను ఓ పెళ్లికి వెళ్తే ఆ ఫంక్షన్ హాల్ పక్కనే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు ఉందని.. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని వెళ్లి కలిసి, అభినందించి వచ్చినట్లు చెప్పారు. ఇక వరంగల్ ప్రీతి కేసు, మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు.. ఇలాంటి కేసుల గురించి ప్రజలను చైతన్యపరచాలని తాను అనుకుంటానని.. అంతేగానీ కాంట్రవర్సీ చేయాలని అనుకోనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకోవడం, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని అనుకోవడం కాంట్రవర్సీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏ మార్పు రాకుండా.. ఏమీ చేయకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటే చాలు అనుకునే వాళ్లు ఒకలా ఉంటారని.. కానీ తాను రిస్క్ తీసుకునే వ్యక్తిని అని స్పష్టం చేశారు. కానీ తాను కాంట్రవర్సీ ఆఫీసర్‌ను కాదని తెలిపారు. ఆయేషా మీరా కేసును తాను దర్యాప్తు చేయలేదని.. ఆ కేసులో తాను చేసింది తప్పని సీబీఐ చెప్పలేదని వెల్లడించారు. హైడ్రా అనేది చాలా ప్రభావవంతమైన ఉద్యోగమని.. హైడ్రా చేసిన పని ఎలాంటిదో మరో 100 ఏళ్ల తర్వాత అర్థమవుతుందని రంగనాథ్ తెలిపారు. దాని వల్ల భావితరాలు లబ్దిపొందుతాయని చెప్పారు. మనం చేసే పని వల్ల కొంతమంది నష్టపోయినా.. ఎక్కువ మంది లాభపడితే సరైన పని చేస్తున్నట్లే అని తాను అనుకుంటానని.. అదే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో కబ్జాలకు పాల్పడే వారిని ఎవర్నీ హైడ్రా వదలదని.. పేదల జోలికి హైడ్రా వెళ్లదని.. వెనుకాల ఉండి నడిపించే వారి చేతిలో పావులు కావొద్దని హితవు పలికారు. చెరువులు, పార్కులను ఆక్రమిస్తానంటే కుదరదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.