ప్రతి ఏడాది జరిగే స్టార్ మా పరివారం అవార్డ్స్ ఫంక్షన్ ఈ సంవత్సరం కూడా వైభంగా జరిగింది. హీరో నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ఈవెంట్‌కి తరలివచ్చారు. పలు కేటగిరిల్లో ఉత్తమ ప్రతిక్ష కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. అందజేశారు. ఇక ప్రతిష్టాత్మకమైన ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ (ఫీమేల్) అవార్డు.. బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు (కావ్య)కి దక్కింది.ఈ అవార్డుకి కృతిక ఉమా శంకర్ (పొదరిల్లు, మగువ ఓ మగువ), ప్రేమి విశ్వనాథ్ (కార్తీకదీపం), ఆమని (ఇల్లు ఇల్లాలు పిల్లలు), దీపిక రంగరాజు (బ్రహ్మముడి) పోటీలో నిలవగా దీపికని పురస్కారం వరించింది. దీపికకి సంబంధించిన ఏవీ చాలా ఎమోషనల్‌గా ఉంది. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని పెద్ద ఆశ కలిగింది.. ఇంట్లో వెళ్లి చెప్తే మమ్మీ నాతో గొడవపడి తిట్టి తనకి బీపీ ఎక్కువైపోయింది.. అలా కిందపడిపోయి తనకి గుండె నొప్పి వచ్చింది.. అంటూ వీడియోలో దీపిక చెప్పింది.అమ్మకి గుండెపోటు వచ్చిందినేను అందరినీ వదులుకునే ఇండస్ట్రీకి వచ్చాను.. ఇండస్ట్రీలోనే ఉన్నాను.. అంటూ చెప్పింది. ఇక హీరో అడివి శేష్ చేతుల మీదుగా దీపికకి ఈ అవార్డుని అందజేశారు. ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఫీమేల్ అవార్డ్ విన్నర్ కావ్య అంటూ చెప్పగానే దీపిక ఎగిరి గంతేసింది.. సిట్టింగ్‌లో కూర్చోవడానికి కూడా నాకు అర్హత ఉందా అనుకుంటుండగా నాకు ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు చూడండి.. థాంక్యూ సో మచ్ స్టార్ మా.. అంటూ చెప్పింది. దీపిక తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి వచ్చారు.మరోవైపు 'విలక్షణ పాత్ర' పేరుతో పెట్టిన కేటగిరిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ త్రివేణి (వల్లి) అవార్డు అందుకుంది. హీరో నిఖిల్, నభా నటేష్, సంయుక్త ఈ అవార్డుని ప్రకటించారు. తన తల్లికి ఈ అవార్డుని అంకితం చేసింది త్రివేణి. నేను ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం మా అమ్మ.. నాన్న లేకపోయినా సరే ఎంతో కష్టపడి నన్ను పెంచింది.. చాలా మంది మా గురించి నెగెటివ్‌గా మాట్లాడారు. అవన్నీ వదిలేసి నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి అంత సపోర్ట్ ఇచ్చింది నా తల్లి.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది త్రివేణి.ఇక ఈ ప్రోమో మొదటిలో శేఖర్ మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. నటి తేజస్విని గౌడతో కలిసి కుర్చీ మడతపెట్టి పాటకి స్టెప్పులేశారు. అలానే సిరి హనుమంతుతో కూడా మరో సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.