పరీక్షల్లో ఆన్సర్ షీట్లలో పాస్ చేయాలని ఎగ్జామినర్‌లను వేడుకునే విద్యార్థులను మనం చాలా చూస్తూ ఉంటాం. పేపర్ల మధ్య డబ్బులు పెట్టి పాస్ చేయించాలని కోరే వాళ్లను కూడా చూశాం. ఇక తనకు ఆన్సర్లు రావని సినిమా స్టోరీలు రాసేవాళ్లను కూడా చూశాం. కానీ.. తాజాగా జరిగిన పూర్తి కావడంతో పేపర్లు దిద్దుతుండగా.. అలాంటి ఆణిముత్యాలే బయటికి వస్తున్నారు. తాజాగా ఓ స్టూడెంట్.. ఇంటర్ పరీక్షలో ఆన్సర్ షీట్లో రాసిన రాతలు, వేసిన బొమ్మలను.. ఆ పేపర్ దిద్దే ఎగ్జామినర్ ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇటీవలె తెలంగాణ ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే పేపర్ల వ్యాల్యుయేషన్ ప్రారంభం అయింది. పరీక్షలో పాస్ చేయాలని కోరుతూ ఆ స్టూడెంట్ తన ఆన్సర్ షీట్‌లో రాసిన మ్యాటర్ చూసి ఆ ఎగ్జామినర్ ఆశ్చర్యపోయాడు. 'సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి. అంటూ ఆ విద్యార్థి ఎగ్జామినర్‌ను వేడుకున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక అందులో ఎగ్జామినర్‌ను వేడుకోవడమే కాకుండా కొన్ని బొమ్మలు కూడా వేశాడు. అందులో ఎగ్జామినర్ బొమ్మవేసి.. ఆ ఎగ్జామినర్ కాళ్లు తాను పట్టుకుని వేడుకుంటున్నట్లుగా తన క్రియేటివిటీని చూపించాడు. గురువు కాళ్లపై పడి శిష్యుడు నమస్కరిస్తున్నట్లు గీసి.. దానికి గురువును సార్ అని.. శిష్యుడు తాను అని రాశాడు.అంతేకాకుండా.. తనకు అమ్మ, నాన్న లేరని.. గురువులే తనకు తల్లిదండ్రులు అంటూ ఎగ్జామినర్‌ను తన వైపు తిప్పుకునేందుకు ఎమోషనల్‌ అస్త్రం వేశాడు. వీటితోపాటు తాను చదివిన ఆన్సర్లు.. ఆ పరీక్షలో ఏవీ రాలేదని పేర్కొన్నాడు. దేవుడు ఉన్నాడని తాను నమ్ముతున్నానని.. ఆ దేవుడు కూడా మీరే సార్ అంటూ ఎగ్జామినర్‌ భజన చేశాడు. తనను ఆ పరీక్షలో పాస్ చేస్తే ఆ ఎగ్జామినర్ తనకు మేలు చేసిన వారు అవుతారని.. ప్లీజ్ సార్ అంటూ ఆ విద్యార్థి రాసిపెట్టాడు.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియకపోయినా.. అచ్చంపేట ప్రాంతానికి చెందినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వింతైన ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఎగ్జామ్‌కు సరిగ్గా ప్రిపేర్ కావడం కంటే.. ఎగ్జామినర్‌ను ఎలా కాకా పట్టాలని ఆ స్టూడెంట్ బాగా ప్రిపేర్ అయ్యాడని హేళన చేస్తున్నారు. అందులో అన్ని బొమ్మలు గీసి లేఖలు రాయడానికి.. పరీక్ష సమయం పూర్తి అయినట్లు జోకులు వేస్తున్నారు.